పోలవరం ప్రాజెక్టు పూర్తికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. సీఎం జగన్ తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘పునరావాస కాలనీలో కల్పించిన వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. మరోసారి ప్రాజెక్టులో పర్యటిస్తాను’ అని అన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుంది. కేంద్ర సహకారంతో పూర్తి చేస్తాం. నిర్వాసితులకు కేంద్ర ప్యాకేజీతో పాటు రాష్ట్రం సాయం కూడా అందిస్తాం. పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాల’ని అన్నారు.
దేవీపట్నం మండలం ఇందుకురూ-1 లో, ఏనుగుల గుడెంలోని పోలవరం నిర్వాసితులతో సీఎం, జలశక్తి వనరుల మంత్రి షెకావత్ ముఖాముఖి మాట్లాడారు. అక్కడి పునరావాస కాలనీని పరిశీలించారు. వీరితో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
910803 725796You need to join in a contest 1st of the greatest blogs on the internet. I will recommend this web website! 268592
131039 182551Merely wanna state that this really is quite beneficial , Thanks for taking your time to write this. 986342