కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో తేలిందేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,675FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతోంది. తొలి విడతలోనే ఏపీ అసెంబ్లీతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. అనంతరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసి 12 రోజులు కావస్తున్నా, ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై లెక్కలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలివే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అంకెలు చక్కర్లు కొడుతున్నాయి.

చివరి విడత ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేయడంతో ఏ సంస్థా అధికారికంగా ఫలితాలు విడుదల చేయలేదు. అయితే, ఫలితాలు ఇవేనంటూ లీకులు వస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించబోతున్నాయంటూ ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో వెల్లడైన ఫలితాలు ఇవేనంటూ కొన్ని లెక్కలు దర్శనమిస్తున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ సందర్భంగా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది.

ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధికారం కేవసం చేసుకుంటుందని, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ఆ సర్వేలో తెలింది. వైఎస్సార్ సీపీకి 95 నుంచి 105 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే, ఎంపీ సీట్లు మాత్రం ఆ పార్టీకి 16 నుంచి 19 మాత్రమే వస్తాయని పేర్కొంది. కీలకమైన 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ ఓటమి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, కర్నూలు సీట్లలో వైఎస్సార్ సీపీ గెలిచే అవకాశాలు అంతగా లేవని సర్వేలో తేలినట్టు సమాచారం.

ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో వైఎస్సార్ సీపీకి 100 నుంచి 130 స్థానాల వరకు వస్తాయని వెల్లడైంది. అలాగే 20 వరకు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. అయితే, కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వేలో మాత్రం ఎంపీ సీట్లు తగ్గడం గమనార్హం. అధికార తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని, ఆ పార్టీకి 65 నుంచి 70 అసెంబ్లీ సీట్లు, 6 నుంచి 9 ఎంపీ సీట్లు వస్తాయని కేంద్ర నిఘా విభాగం సర్వేలో తేలింది.

ఇక జనసేన ప్రభావం ఎంపీ సీట్లపై ఉండదని, అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఆ పార్టీ గరిష్టంగా మూడింటిలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం ఖాయమని తాజా సర్వేలోనూ తేలింది. గులాబీ పార్టీకి 14 నుంచి 16 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైనట్టు సమాచారం. ఇక్కడ ఎంఐఎం ఒకటి, బీజేపీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది. మొత్తమ్మీద ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఈ సర్వేలు వెల్లడిస్తున్నా.. అసలు ఫలితాలు వచ్చేవరకు కచ్చితంగా ఏదీ చెప్పలేం. మే 19న సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు, మే 23న అసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అప్పటివరకు వేచి చూడక తప్పదు.

12 COMMENTS

సినిమా

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

రాజకీయం

కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. టీడీపీ కేడర్‌కు లోకేష్ పిలుపు

అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల...

25 ఏళ్లకే 23 కేసులు.. అదృశ్యమైన పిల్లా సాయి వెనుక సంచలన క్రిమినల్ చరిత్ర!

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అదృశ్యమైన యువకుడు పిల్లా సాయి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై కొన్ని వర్గాలు కుల కోణంలో కథనాలు ప్రచురిస్తుండగా, మరోవైపు అతనికి సంబంధించిన...

జులైలో తల్లికి వందనం.. లోకేష్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి...

గోదావరి క్లీన్ మిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ గోదావరి క్లీన్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక మద్దతు ప్రకటించింది. గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రత్యేక...

లోకేష్ ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన వినతులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన...

ఎక్కువ చదివినవి

NBK 111: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది..

NBK 111: బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 111వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలకృష్ణతో 2003లో తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’తో సక్సెస్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ ఈ సినిమాకు దర్శకత్వం...

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! OG-2 అప్డేట్ వచ్చేసింది

Pawan Kalyan: గతేడాది విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య 2025 సెప్టెంబర్ 25న విడుదలైన సినిమా భారీ వసూళ్లు...

ప్రభాస్ ‘ఫౌజీ’కి భారీ డీల్.. ఉత్తర భారత హక్కులు రికార్డు ధరకు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా మరో...

Bharathiraja: దర్శక దిగ్గజం ‘భారతీరాజా’ కన్నుమూత..! ప్రముఖుల సంతాపం

Bharathiraja: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు....

మాతృత్వానికి కొత్త అర్థం చెప్పిన జ్వాలా గుత్తా.. 60 లీటర్ల తల్లి పాలు విరాళం

 భారత బ్యాడ్మింటన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జ్వాలా గుత్తా, ఈసారి క్రీడల కారణంగా కాదు.. తన మానవతా దృక్పథంతో వార్తల్లో నిలిచారు. తల్లిగా మారిన తర్వాత ఆమె తీసుకున్న ఒక నిర్ణయం...