Switch to English

ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జనం పిట్టల్లా రాలిపోవడమంటే ఏంటో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో చూశాం. మొదటి వేవ్ విషయానికొస్తే.. అప్పుడూ ప్రాణాలు పోయాయి కరోనా వైరస్ కారణంగా. రెండో వేవ్ మరీ దారుణమైనది. దాదాపుగా దేశంలో ప్రతి ఒక్కరూ తమకు అత్యంత సన్నిహితుల్లోనో, కుటుంబ సభ్యుల్లోనో కనీసం 5 నుంచి 10 మందిని కోల్పోయారు. వీరిలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయినవారే ఎక్కువ.

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక.. ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే.. చాలామంది విగత జీవుల్లా మారిపోయారు. స్మశానాల యెదుట శవాలు క్యూ కట్టడం చూశాం. ఇది కళ్ళ ముందు కనిపించిన వాస్తవం. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవు. దేశమంతా ఇదే పరిస్థితి. కానీ, ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదని కేంద్రం అంటోంది.

ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రానికి, రాష్ట్రాలుగానీ.. కేంద్ర పాలిత ప్రాంతాలుగానీ సమాచారం ఇవ్వలేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా సమాధానమిచ్చింది.. అదీ లిఖిత పూర్వకంగా. ఇంతకీ, అసలు దేశంలో కరోనా వైరస్ వుందని కేంద్రం ఒప్పుకుంటోందా లేదా.? కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని అయినా కేంద్రం అంగీకరిస్తుందా.? లేదా.?

కోవిడ్ వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.. కోట్లాది జీవితాలు రోడ్డున పడిపోయాయి. ఆ లెక్కలేవీ కేంద్రం వద్ద వుండవు. చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకే ఆక్సిజన్ అందని సమస్య వచ్చిపడింది. కేంద్రం ఇప్పుడెలాంటి కథలు చెబుతున్నా, ఆక్సిజన్ కొరత దేశంలో వున్న మాట వాస్తవం. అందుకే, వివిధ దేశాల నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది కేంద్రం. రైలు మార్గం, రోడ్డు మార్గం, జల మార్గం, వాయు మార్గం.. ఇలా అన్ని మార్గాల్లోనూ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.

నో డౌట్, కేంద్రం కష్టపడింది.. రాష్ట్రాలూ కష్టపడాల్సి వచ్చింది. ప్రజలూ ప్రాణాలు కోల్పోయారు. అసలంటూ రాష్ట్రాలు ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వైనంపై కేంద్రానికి ఎందుకు నివేదికలు ఇవ్వలేదు.? తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్యతోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చూశాం. ఇది రాష్ట్రంలో అతి పెద్ద ఘటన. తెలంగాణలోనూ ఆక్సిజన్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవేవీ కేంద్రం లెక్కల్లోకి వెళ్ళలేదంటే తప్పు ఎక్కడ జరిగినట్లు.?

బాధ్యత లేని ప్రభుత్వాలు.. బాధ్యత లేని వ్యవస్థలు.. వెరసి, ప్రజల ప్రాణాల్ని బలిగొన్నాయన్నప్పటికీ, ఆ బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకునేందుకు పాలకులకు మనసొప్పడంలేదు. మొదటి వేవ్ తీవ్రంగా వున్న సమయంలో లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించి.. దేశంలో రెండో వేవ్ తీవ్రంగా రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. దేశంలో చోటు చేసుకున్న ప్రతి కరోనా మరణానికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నైతిక బాధ్యత వహించాలి.

ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...