కొవిషీల్డ్ డోసుల వ్యవధిని 8-12 వారాలకు పెంచాలని తాము సిఫార్సు చేస్తే.. కేంద్రమే 12-16 వారాలకు పెంచిందని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) సభ్యులు కొందరు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు వ్యాక్సిన్ల కొరతతోనే ఇంత వ్యవధి పెంచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పష్టతనిచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ ఈమేరకు ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
‘అనేక అధ్యయనాల అనంతరమే టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాం. ఇది పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయం. కొవిషీల్డ్ డోసుల వ్యవధి పెంపుపై శాస్త్రీయ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు భారత్ వద్ద చాలా పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. దీనిని రాజకీయం చేయడం తగదు’ అని అన్నారు. ఎన్టీఏజీఐ ఛైర్మన్ డా.ఎన్కే అరోరా కూడా డోసుల మధ్య వ్యవధి పెంపుపై తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. భవిష్యత్తుల్లో వ్యవధి తగ్గించే అవకాశం లేకపోలేదన్నారు.
170245 634256In todays news reporting clever journalists work their own slant into a story. Bloggers use it promote their works and several just use it for fun or to stay in touch with pals far away. 473113