తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సి వుంది..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని, గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పోల్చి చూడటం సహజమే.
సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ అప్పుడేమన్నారో, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అంటున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తోన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని ఆకాంక్షించారు.
ప్రధాన ప్రతిపక్షంగా పెద్దన్న పాత్ర పోషించి, విపక్షాల్ని ఒక్కతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత టీడీపీ మీదనే వుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని తొలుత నినదించింది పవన్ కళ్యాణ్ గనుక, జనసేన పార్టీకి టీడీపీ మద్దతిస్తుందనే ప్రకటన చంద్రబాబు నుంచి వస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే, ‘పవన్ కళ్యాణ్ మనోడే..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన ‘యెల్లో’ రాజకీయాన్ని ఇంకోసారి ప్రయోగిస్తే మాత్రం, 2019 ఎన్నికల తరహాలోనే, వైసీపీకి ఇంకోసారి చంద్రబాబే అధికారం కట్టబెట్టేసినట్లవుతుంది. 2019 ఎన్నికల్లో కూడా ‘పవన్ కళ్యాణ్ మనవాడే..’ అంటూ టీడీపీ చేసిన దుష్ప్రచారం వైసీపీకి కలిసొచ్చింది.
2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని ఉద్ధరించేసిన చంద్రబాబు, 2024 ఎన్నికల విషయంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన పక్కన పెట్టేసి, జనసేన పార్టీకి మద్దతిస్తే.. రాష్ట్రం ఏమన్నా బాగుపడేందుకు ఆస్కారముంటుంది.
41989 693290Oh my goodness! a great post dude. Thanks Nonetheless My business is experiencing concern with ur rss . Do not know why Struggling to join it. Is there anybody acquiring identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 819715
486136 933764really excellent put up, i definitely enjoy this web web site, maintain on it 833391