బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన దగ్గర పీఎస్ గా శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేశారు. అమరావతి భూముల విషయంలో అవకతవకలు జరగడంతో బాబుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే బాబు అండ్ కో కలిసి చేసిన భూదందా గురించి అసెంబ్లీ సాక్షిగా వైకాపా బాయటపెట్టింది. అయితే, బాబుకు సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా వివిధ వ్యక్తుల పేర్లతో ఉండటంతో ఆయన్ను కదిలించలేకపోతున్నారు.
ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండువేల కోట్ల రూపాయలు దొరికాయని వైకాపా చెప్తుంటే, లేదు కేవలం 2లక్షల రూపాయలు మాత్రమే అయన ఇంట్లో దొరికాయని, వైకాపా అభాండాలు వేస్తోందని చెప్పి అంటోంది. అదే విధంగా వైకాపా కూడా టీడీపీపై ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బాబు చేసిన అక్రమాలకు సంబంధించిన గుట్టు మొత్తం కూడా మాజీ పీఎస్ దగ్గర ఉందని వైకాపా నేతలు అంటున్నారు.
మాజీ పీఎస్ వాటికి సంబంధించిన పద్దులను డైరీలో రాసిభద్రంగా పెట్టుకున్నారని, కంప్యూటర్ లో నిక్షిప్తం చేశారని, బాబు గుట్టు మొత్తం ఇప్పుడు మాజీ పీస్ చేతిలో ఉందని, మాజీ పీఎస్ దగ్గర ఉన్న పాస్ వర్డ్ ఓపెన్ చేస్తే బాబు అక్రమ చిట్టా బయటపడుతుందని అంటున్నారు వైకాపా నేతలు. రోజు రోజుకు ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య ముదిరిపోతోంది. నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీల మధ్య రగడ జరుగుతుండటం విశేషం. మరి దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. నిజంగానే మాజీ పీఎస్ దగ్గర ఆస్థాయిలో డబ్బు దొరికిందా ? ఒకవేళ దొరికితే ఈపాటికి దానిని ఐటి అధికారులు బయటపెట్టేవారు కదా… ఎందుకు బయటపెట్టలేదు.
428727 60443i was just browsing along and came upon your web site. just wantd to say fantastic job and this post genuinely helped me. 913855
802334 555478I identified your blog on yahoo and can bookmark it currently. carry on the good work. 713972
889622 90206Hello, Neat post. There is a difficulty together with your site in internet explorer, could test thisK IE nonetheless will be the marketplace leader and a large portion of individuals will leave out your excellent writing due to this issue. 412104