ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఇటివలే రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది.
ఈక్రమంలో విచారణకు హాజరు కావాలని కోరింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని.. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందినట్టు కవిత ధ్రువీకరించారు. ఈనెల 6న హైదరాబాద్ లోని తన ఇంట్లో అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చినట్టు కూడా వెల్లడించారు.
లిక్కర్ స్కాంలో ఉన్నట్టు అనుమానిస్తున్న 36 మంది పేర్లను ఈడీ అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇటివలే ఆయనను అరెస్టు చేసింది. లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్ రెడ్డి పేర్లు ఉన్నాయి.
258415 205170Hey i just visited your internet site for the initial time and i genuinely liked it, i bookmarked it and will likely be back 345322
951031 239985A domain name is an identification label which defines a realm of administrative autonomy, authority, or control inside the Internet. Domain names are also critica for domain hostingwebsite hosting 274886