ప్రపంచం చాలా మారింది.! కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన ఎంత తక్కువ వుంటే అంత మంచిది.! ఔను, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల్ని చూస్తున్నాం. అమెరికా అబ్బాయ్, ఆంధ్రా అమ్మాయ్.. ఆఫ్రికా అమ్మాయ్.. తెలంగాణ అబ్బాయ్.. ఇలా చాలా మారిది ప్రపంచం.
కానీ, మన దేశంలో.. అందునా, మన తెలుగు నేల మీద మాత్రం కుల, మత, ప్రాంత ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడంలేదు. రాజకీయాలే కాదు, సినిమా రంగంలోనూ ఇదే ప్రస్తావన. మీడియా రంగంలో సంగతి సరే సరి.! ఎటు చూసినా కులం కంపు కొడుతూనే వుంది.
ఇటీవల ఓ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రముఖుల్లో కొందరు, వేర్వేరు కులాలకు చెందినవారూ వున్నారు. ఆ కార్యక్రమంలోనే, ఒకావిడ, ‘ఎనిమిదో వారం’ ప్రస్తావన తీసుకొచ్చారు.
వీళ్ళంతా స్వయం ప్రకటిత మేధావులు.! వేరే ఏ కులానికీ లేని విధంగా, తమ కులానికి గౌరవం వుందని చెప్పుకున్నారు కొందరు. ముందే చెప్పుకున్నట్టు, సమాజం చాలా మారింది.! కొందరు మాత్రం ఇంకా మారలేదు. అలాంటి మూర్ఖులే, తమ కులానికి ఓ వారం పేరు తగిలించుకుని, వెకిలి చేష్టలు చేస్తున్నారు.
సోమవారం, బుధవారం, గురువారం.. ఇలా వారంలో ఏడు రోజులకీ ఏడు పేర్లున్నట్టు, ఆ ఎనిమిదో రోజుకీ, ఆ కులం పేరు తగిలించేసుకున్నారు. అసలు వారంలో ఎనిమిదో రోజు ఎక్కడుంది.? దీన్నే ‘పిచ్చి’ అంటారు.! ఇలాంటి పిచ్చి మేతావులతోనే సమాజానికి ప్రమాదమేర్పడుతోంది.
ఏ కులానికి ఆ కులమే గొప్ప. ఏ మతానికి ఆ మతమే గొప్ప. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే గొప్ప.! ఒకరు తక్కువా కాదు, ఇంకొకరు ఎక్కువా కాదు.. మనుషులంతా సమానమే. మేధావులు అన్ని కులాలు, మతాల్లోనూ వున్నారు. అలాగే, మూర్ఖులు కూడా అన్ని కులాలు, మతాల్లోనూ వుంటారు. ఆ కొందరు మూర్ఖులతోనే సమాజానికి ముప్పు ఏర్పడుతోంది.
వారానికి ఏడు రోజులు మాత్రమే వుంటాయ్.. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు మాత్రమే.! ఎనిమిదో వారం అని ఎవడైనా అంటే, వాడ్ని వెంటనే పిచ్చాసుపత్రికి పంపించెయ్యాలి.!
