దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మర్కజ్ కారణంగానే ఈ పరిస్థితి అంటూ ఒక వర్గం వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది ఏ ఒక్కరి వల్లో లేదంటే ఏ ఒక్క మతం వల్లో కాదని ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకోవద్దంటూ మొదటి నుండి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంగనా సోదరి రంగోలి తాజాగా ట్విట్టర్ లో ఒక వర్గం వారికి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. అలాంటి వారిని క్యూలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ ఆమె ఖాతాను సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. సోదరి ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేయడంపై కంగనా తీవ్రంగా స్పందించింది. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్లో ఒక ముస్లీం కుటుంబానికి వైధ్య పరీక్షలు చేసేందుకు వెళ్లిన సమయంలో వారు డాక్టర్లు, పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఆ వీడియోను కంగనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉన్న విషయంను చెబితే ఎందుకు ఇంతలా వ్యతిరేకత చూపుతున్నారు. ట్విట్టర్లో రంగోలీ దీని గురించే ప్రస్థావించగా ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారంటూ కంగనా ట్విట్టర్పై అసహనం వ్యక్తం చేసింది.
రంగోలి వ్యాఖ్యలు మరియు కంగనా ఆమెకు మద్దతు తెలపడంపై ముంబయికి చెందిన అలీ కాపిఫ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు సమాజంలో రెండు వర్గాల మద్య గొడవలు సృష్టించేలా, మారణహోమంకు దారితీసేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అతడు తీవ్రమైన ఆరోపణలతో కేసు పెట్టాడు. అతడి కేసును నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిద్దరి సోషల్ మీడియా అకౌంట్స్ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నిజం నిరూపితం అయితే ఈ ఇద్దరు అక్క చెల్లెల్లకు కనీసం రెండున్నర నుండి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
655681 376641Do men and women still use these? Personally I really like gadgets but I do prefer something a bit more up to date. Nonetheless, nicely written piece thanks. 250084