ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తుంటే ఇండియాను సిఏఏ కుదిపేస్తోంది. సిఏఏ నిరసనల వలన దేశంలో పాలన సరిగా జరగడం లేదు. సిఏఏ వలన ముస్లిం మైనారిటీలకు ఇబ్బందులు వస్తాయని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి అన్ని అపోహలే అని, సిఏఏ వలన ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా మైనారిటీ పార్టీలు ఈ విషయంలో రచ్చ చేస్తున్నాయి. సభలు నిర్వహించి ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నిరసనల వలన ఢిల్లీలో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. చట్టాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి కొన్ని పార్టీలు. అయితే, ఇప్పుడు ఆ సెగ వైకాపా పార్టీకి కూడా తగిలినట్టుగా కనిపిస్తోంది.
నిన్నటి రోజున గుంటూరు నగరంలో సింహగర్జన పేరుతో ఓ సభ జరిగింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సిఏఏ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాలని ముస్లిం నేతలు చెప్పుకొచ్చారు. ఈ సభలో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా, ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు పాల్గొన్నారు. సిఏఏ కు వ్యతిరేకంగా వైకాపా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని, వీటిని ఏపీలో అమలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు.
జగన్ పై ఒత్తిడి తీసుకొస్తామని, అమలు జరగకుండా చూస్తామని అన్నారు. ఒకవేళ జగన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఉంటె, పార్టీకి రాజీనామా చేస్తామని, తమకు పార్టీలు, పదవులు ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో జగన్ ఆలోచన ఎలా ఉన్నదో చూడాలి. ఇప్పుడిప్పుడే జగన్ కేంద్రానికి దగ్గర అవుతున్నాడు. ఈ సమయంలో వీటిని వ్యతిరేకించి కేంద్రంతో తగువు పెట్టుకుంటాడా? చూడాలి.
447853 827060my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 887198
151956 653960Thanks for some other wonderful post. Exactly where else may just anyone get that type of information in such an perfect means of writing? Ive a presentation next week, and Im at the search for such information. 563721