కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన సినీ కార్మికులు ఉపాది లేక అవస్థలు పడుతున్నారు. ఇక త్వరలోనే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత అసలు సమస్యలు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం ఆరు నెలల పాటు థియేటర్లు ఇంకా మాల్స్ పూర్తి స్థాయిలో సాగే పరిస్థితి లేదు. ఈ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా అనే ఆందోళన బయ్యర్లలో వ్యక్తం అవుతుంది.
లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా విడుదల ఆగిపోయాయి. వాటిని మే లేదా ఆ తర్వాత విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో సినిమా బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉండగా వారికి తీవ్ర నిరాశ ఎదురవుతుందట. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిన్న సినిమాలను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. పెద్ద సినిమాలకు భారీ రేట్లు పెడితే వచ్చేది ఎంతో పోయేది ఎంతో అనే భయంతో కొనుగోలు చేసేందుకు బయ్యర్లు సిద్దపడటం లేదు.
పెద్ద సినిమాలను భారీ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే టెన్షన్ ఉందట. అందుకే బయ్యర్లు సినిమాలు కొనుగోలు చేయాలంటేనే రిస్క్గా భావిస్తున్నారట. కొంత కాలం వరకు సినిమాల విడుదలకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయానికి చాలా మంది బయ్యర్లు వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లకు గడ్డు కాలం అవ్వడంతో పలు థియేటర్లను లీజ్కు తీసుకున్న నిర్మాతలు ఇంకా బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లుగా తెలుస్తోంది.
844848 84535Hey there! Good stuff, please maintain us posted when you post again something like that! 788426
90787 918074Any person several opportune pieces, it comes surely, as properly as you bring in crave of various the several other types of hikers close to you with hard part your question. pre owned awnings 475388