చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి తిరుపతికి వెళ్తున్న పెళ్లి బస్సు చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోని లోయలో పడిపోయింది. ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సు సుమారు 50 అడుగుల లోతులో పడిపోయింది. నిశ్చితార్ధం ఫంక్షన్ కు వెళ్తూండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులో 50 మంది ఉన్నారు. ప్రైవేట్ బస్సు భాకరాపేట వద్ద కీలకమైన మలుపు వద్ద అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది. చీకటిలో ప్రమాదం జరగడం.. ఏం చేయాలో తెలీని పరిస్థితిల్లో గాయాలైన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదకరంగా మారింది. బస్సు డ్రైవర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. చీకట్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
228603 284544I dugg some of you post as I thought they were incredibly valuable handy 805212
927603 706560Ill proper away grasp your rss feed as I cant in locating your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me realize so that I might subscribe. Thanks. 494506