కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు గూడ్స్ లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న పెద్ద గుంతలోకి పడిపోయింది. దీంతో క్షణాల్లో మంటలు అంటుకుని బస్సు కాలిపోయింది. ఈ దారుణ ఘటనలో 8మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారే. కర్ణాటకలోని కలబురిగి జిల్లా కమలాపురంలో ఈ తెల్లవారుఝాము 6గంటలకు ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సు సిబ్బందితోపాటు 35 మంది ఉన్నారు.
పుట్టినరోజు వేడుకల కోసం రెండు కుటుంబాలకు చెందిన 32 మంది గోవా వెళ్లారు. వీరిలో ఒక కుటుంబానికి చెందిన వారు 21, మరో కుటుంబానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కలబురిగిలోని మూడు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో అర్జున్ కుమార్, అతని భార్య, బివాన్, దీక్షిత్, అనితా రాజు, శివకుమార్, రవళి, మరొకరు మృతి చెందారు.
927883 969430A blog like yours should be earning considerably money from adsense..-., 85553
Its like you read my mind! You appear to know so much about this,
like you wrote the book in it or something. I think that you could do with
some pics to drive the message home a little bit, but instead of that, this is great blog.
An excellent read. I’ll certainly be back.