Switch to English

క్రైమ్ న్యూస్: దారుణం: 14ఏళ్ళ బాలికని పెట్రోల్ పోసి తగలబెట్టారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

08.00 P.M: దారుణం: 14ఏళ్ళ బాలికని పెట్రోల్ పోసి తగలబెట్టారు

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువెన్నాయినల్లూర్ కి సమీపంలోని సిరుమదురై గ్రామంలో తండ్రి జయపాల్ తో కలిసి నివసిస్తోంది 14 ఏళ్ళ జయశ్రీ. ఇంటికి దగ్గరలోనే జయబాల్ ఒక షాప్ ఉంది. సోమవారం తెల్లవారు జామునే ఏఐఏడిఎంకె పార్టీకి చెందిన జి.మురుగన్ జయబాల్ ఇంటికి వచ్చి షాప్ తెరవమని చెప్పాడు. కానీ ఆ సమయంలో తండ్రి ఇంటిలో లేకపోవడంతో జయశ్రీ నేను షాప్ తెరవలేనని చెప్పింది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన మురుగన్ తన సన్నిహితుడు కె.కలియపెరుమాళ్ తో కలిసి మళ్ళీ గంట సేపటి తర్వాత వచ్చి, జయశ్రీని బలవంతంగా తాళ్లతో కట్టేసి, తనపై పెట్రోల్ పోసి తగలబెట్టారని జయశ్రీ మరణ వాంగ్మూలంలో తెలిపింది.

జయశ్రీ కాలిపోతుండడంతో ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టు పక్కల వారు వెంటనే మంటలు ఆర్పీ వెంటనే దగ్గరలోని విల్లుపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. షాప్ తెరవడమొక్కటే రీజన్ కాదని జయబాల్ అండ్ మురుగన్ ఫ్యామిలీ లో పాత కుటుంబ గొడవలు కూడా ఉన్నాయని పోలీసు విచారణలో తేలింది. విల్లపురం స్ప్ జయకుమార్ ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి అన్ని విధాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

03.30 P.M: కోవిడ్‌ 19 : చైనాలో పరిస్థితి మళ్లీ మొదటికి

చైనా.. కరోనా.. ‘విలయం’ వెనుక ఇంత దారుణమా.!

కరోనాకు పుట్టినిల్లు ఏంటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఠక్కున చెప్పేది చైనా పేరు. పుట్టించారో, పుట్టిందో తెలియదు కాని కరోనా చైనాలో ఆరంభం అయ్యిందని మాత్రం నిజం. కరోనా వైరస్‌ వల్ల మొదటగా నష్టపోయింది చైనా. అయితే చైనా ఆ నష్టంను చాలా తక్కువ మోతాదుతోనే బయట పడినది. మృతుల సంఖ్యతో పాటు పాజిటివ్‌ల సంఖ్య కూడా తక్కువే అని చెప్పాలి. ఇతర దేశాల్లో ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులతో పోల్చితే చైనా చాలా బెటర్‌ అనుకోవచ్చు.

చైనాలో కరోనా కేసుల సంఖ్య జీరో అనుకుంటున్న సమయంలో స్కూల్స్‌, వ్యాపార సంస్థలు మళ్లీ ప్రారంభం అయిన సమయంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో అక్కడ కొత్తగా దాదాపుగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేయడంతో పాటు ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్న కారణంగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈసారి అక్కడ కరోనా విజృంభిస్తే పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందంటున్నారు.

01.30 P.M: మదర్స్‌ డే రోజున తల్లిదండ్రులను చంపిన టెక్కీ

క్రైమ్ స్టోరీస్: నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా 45 రోజుల పాటు వైన్‌ షాప్స్‌ మూసి ఉన్నాయి. దాంతో దేశంలో కేసులు దాదాపుగా 90 శాతం వరకు తగ్గాయి అంటూ పోలీసులు స్వయంగా చెప్పారు. ఎప్పుడైతే వైన్స్‌ ఓపెన్‌ అయ్యిందో అప్పటి నుండి మళ్లీ రచ్చ ప్రారంభం అయ్యింది. తాజాగా బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి తాగిన మత్తులో తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రోజూ తాగుతున్నావంటూ మందలించడంతో కన్న తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చంపేశాడు అంటున్నారు స్థానికులు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆర్బీఐ మాజీ ఉద్యోగి అయిన గోవిందప్ప మరియు ఆయన భార్య శాంతమ్మ దంపతులకు నవీన్‌ తనయుడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత రెండు నెలలుగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న నవీన్‌ ఇటీవల మద్యం షాపులు ఓపెన్‌ చేయడంతో కంటిన్యూగా మద్యం తాగుతున్నాడు. దాంతో అమ్మా నాన్న అతడిని మందలించారు. ఆ కోపంతో రగిలి పోయిన నవీన్‌ వారిని చంపేశారు.

మదర్స్‌ డే అయిన నిన్న రాత్రి నవీన్‌ తన తల్లితో పాటు తండ్రిని కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడంటూ పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. అయితే నవీన్‌ మాత్రం తాను అమ్మానాన్నలను చంపలేదు అంటున్నారు. పోలీసులు తాగిన మైకంలో నవీన్‌ హత్య చేసినట్లుగా ప్రాధమిక నిర్థారనకు వచ్చారు.

12.00 P.M: నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

నెట్లో ఫోటోలు @ మైనర్‌ బాలికపై అత్యాచారం

బీహార్‌లో దారుణం జరిగింది. దంర్బంగా జిల్లాలోని ఒక మారు మూల గ్రామంకు చెందిన 16 ఏళ్ల బాలిక ఏప్రిల్‌ 24వ తారీకున రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు ఆమెను ఫాలో అయ్యారు. నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఆమె నోరు మూసి కొద్ది దూరం లాక్కు పోయారు. అక్కడ వారికి మరో ముగ్గురు కలిశారు. మొత్తం అయిదుగురు కలిసి ఆమెను ఊరు బయట ఉన్న మామిడి తోటలోకి లాక్కు వెళ్లారు.

అత్యంత పాశవికంగా ఒకరి తర్వాత ఒకరు అయిదుగురు ఆమెపై అఘాయిత్యంకు పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను హత్య చేసేందుకు ప్రయత్నించారు. కాని బాలిక ఈ సంఘటన ఎవరికి చెప్పను దయచేసి చంపొద్దంటూ ప్రాదేయ పడటంతో వదిలి పెట్టారు. ఈ విషయం బయటకు చెప్పే కుటుంబంలో అందరిని చంపేస్తామంటూ హెచ్చరించడంతో ఆ బాలిక విషయాన్ని తల్లికి కుటుంబ సభ్యులకు చెప్పలేదు.

ఇటీవల ఆ అయిదుగురులో ఒకడు ఆ సమయంలో తీసిన ఫొటోలు స్నేహితులతో షేర్‌ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాధిత బాలిక తండ్రి కూలి పని కోసం గుజరాత్‌లో ఉంటున్నాడు. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు అయిదుగురిలో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...