పొట్ట చేతపట్టుకొని పలు రాష్ట్రాలకు వలస పోయిన వలస కూలీలు కరోనా ఎఫెక్ట్ వలన ప్రాణం చేత పట్టుకొని తిరిగివారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అందులో కొంతమంది ఆకలి బాధలకు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అంతకు మించిన దారుణమే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
14 మందిని పొట్టన పెట్టుకున్న గూడ్స్ ట్రైన్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పైన నిద్రిస్తున్న వలస కూలీలపైన గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో అక్కడిక్కటే 14 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. తమ ఊరికి కాలినడకన వెళ్తున్న వీరు ట్రైన్స్ ఏమీ రావట్లేదు కదా అని ట్రాక్స్ మీదే పడుకోవడంతో ఈ ఘోరం జరిగి ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
155730 260515It is really a nice and helpful piece of info. Im glad which you just shared this valuable information with us. Please keep us informed like this. Thanks for sharing. 892058