కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు రోజులకే కనిపించకుండా పోయాడు. వీరాకుమార్ కు ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం లేదు. దాంతో అతడు పారిపోయాడు అని వధువు తరపు బంధువులు మరియు కుటుంబ సభ్యులు నిర్థారణకు వచ్చారు.
పెళ్లి అయిన నాలుగు రోజులకే కట్టుకున్న వాడు మోసం చేసి పారిపోయాడు అంటూ వధువు కన్నీటితో పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వీరాకుమార్ ఆఫీస్లో ఒక యువతితో ప్రేమలో ఉన్నట్లుగా ఇప్పుడు వరుడి తరపు బంధువులు అంటున్నారు. దాంతో వీరాకుమార్ పై మరియు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరకుమార్ కోసం పోలీసులు వెదుకుతున్నారు. కర్నూలు నుండి ఒక టీం హైదరాబాద్ చేరుకుని మరీ ఎంక్వౌరీ చేస్తున్నారు.
701812 379187Aw, this was a truly nice post. In concept I wish to put in writing like this in addition ?taking time and actual effort to make an outstanding write-up?nonetheless what can I say?I procrastinate alot and by no indicates appear to get something done. 985388
475893 421175All you need to know about News data to you. 11030