Switch to English

బ్రేకింగ్‌ గాసిప్‌: ఢిల్లీకి జగన్‌.. తన సమస్యలకి పరిష్కారం దొరికేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్‌ గాసిప్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో వున్నారట. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతుండడం వెనుక ‘పెద్ద కారణాలే వున్నాయి’ అన్న కోణంలో, తాజా పరిస్థితులపై ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపాలనుకుంటున్నారట వైఎస్‌ జగన్‌. న్యాయస్థానాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడం వెనుక టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. కీలకమైన విషయాల్లో టీడీపీ కంటే, బీజేపీనే ‘లీడ్‌’ తీసుకుని న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేయడాన్ని ఇప్పటిదాకా వైసీపీ లైట్‌ తీసుకుంటూ వచ్చింది.

అయితే, తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిసనర్‌ నిమ్మగడ్డ వ్యవహారంలోనూ బీజేపీనే లీడ్‌ తీసుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. కొంత కాలం క్రితం, ఇంగ్లీషు మీడియం విషయంలో రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో వెంకయ్యపై వైసీపీ కీలక నేతలు నోరు జారారు, దిగజారుడు వ్యాఖ్యలూ చేశారు. అప్పటినుంచే అసలు కథ మొదలయ్యిందని అంటున్నారు. మరోపక్క, అమరావతి విషయంలో కూడా వెంకయ్యనాయుడు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సి వుందని వ్యాఖ్యానిస్తే, అప్పుడూ వైసీపీ, వెంకయ్యపై ఘాటైన విమర్శలు చేసింది.

ఉపరాష్ట్రపతి హోదాలో వున్న వెంకయ్యపై వైసీపీ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీజేపీ వర్గాల్లో కొంత అసహనానికి కారణమయ్యింది.. క్రమక్రమంగా అదిప్పుడు తీవ్ర రూపం దాల్చిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు, పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ భేటీ కావాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ఖరారయినట్లు తెలుస్తోంది. వీలైతే, ప్రధానితోనూ భేటీ కావాలని వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారట.

ఇదిలా వుంటే, వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రిని వైఎస్‌ జగన్‌ కలవనుండడం నిజమేననీ, ముఖ్యమంత్రితోపాటు పలువురు అధికారులు.. వారితోపాటు తాము కూడా ఢిల్లీకి వెళతామనీ చెప్పారు. జల్‌శక్తి మంత్రితో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యే అవకాశముందనీ, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం జగన్‌ చర్చిస్తారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కోసం ప్రధానిని ఆహ్వానించనున్నట్లు గతంలో ప్రకటించిన సీఎం జగన్‌, ఆ కార్యక్రమాన్ని జులైలో నిర్వహించనున్న దరిమిలా.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరికితే, ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...