రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ గాసిప్ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో వున్నారట. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతుండడం వెనుక ‘పెద్ద కారణాలే వున్నాయి’ అన్న కోణంలో, తాజా పరిస్థితులపై ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపాలనుకుంటున్నారట వైఎస్ జగన్. న్యాయస్థానాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడం వెనుక టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. కీలకమైన విషయాల్లో టీడీపీ కంటే, బీజేపీనే ‘లీడ్’ తీసుకుని న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేయడాన్ని ఇప్పటిదాకా వైసీపీ లైట్ తీసుకుంటూ వచ్చింది.
అయితే, తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిసనర్ నిమ్మగడ్డ వ్యవహారంలోనూ బీజేపీనే లీడ్ తీసుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. కొంత కాలం క్రితం, ఇంగ్లీషు మీడియం విషయంలో రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో వెంకయ్యపై వైసీపీ కీలక నేతలు నోరు జారారు, దిగజారుడు వ్యాఖ్యలూ చేశారు. అప్పటినుంచే అసలు కథ మొదలయ్యిందని అంటున్నారు. మరోపక్క, అమరావతి విషయంలో కూడా వెంకయ్యనాయుడు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సి వుందని వ్యాఖ్యానిస్తే, అప్పుడూ వైసీపీ, వెంకయ్యపై ఘాటైన విమర్శలు చేసింది.
ఉపరాష్ట్రపతి హోదాలో వున్న వెంకయ్యపై వైసీపీ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీజేపీ వర్గాల్లో కొంత అసహనానికి కారణమయ్యింది.. క్రమక్రమంగా అదిప్పుడు తీవ్ర రూపం దాల్చిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు, పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ భేటీ కావాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఖరారయినట్లు తెలుస్తోంది. వీలైతే, ప్రధానితోనూ భేటీ కావాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారట.
ఇదిలా వుంటే, వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రిని వైఎస్ జగన్ కలవనుండడం నిజమేననీ, ముఖ్యమంత్రితోపాటు పలువురు అధికారులు.. వారితోపాటు తాము కూడా ఢిల్లీకి వెళతామనీ చెప్పారు. జల్శక్తి మంత్రితో వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశముందనీ, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం జగన్ చర్చిస్తారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కోసం ప్రధానిని ఆహ్వానించనున్నట్లు గతంలో ప్రకటించిన సీఎం జగన్, ఆ కార్యక్రమాన్ని జులైలో నిర్వహించనున్న దరిమిలా.. ప్రధాని అపాయింట్మెంట్ దొరికితే, ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయట.
65283 411243Your writing is fine and gives food for thought. I hope that Ill have far more time to read your articles . Regards. I wish you that you often publish new texts and invite you to greet me 252689
324783 51873Of course like your site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I discover it extremely bothersome to tell the truth nevertheless Ill surely come back once again. 167122