కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లు అన్నీ రద్దైన విషయం తెల్సిందే. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అణా తేడా లేకుండా సినిమాలకు సంబంధించి అన్ని పనులు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రోజూవారి వేతనాలు తీసుకునే వారికి ఇది చాలా ఇబ్బందికర పరిణామంగా మారింది. దీంతో ఇండస్ట్రీ పెద్దన్న చిరంజీవి మరికొంత మంది సహాయంతో ఏర్పాటు చేసినదే కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి).
దీనికి స్టార్లందరి నుండి విశేష స్పందన లభించింది. ప్రభాస్ 50 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, అల్లు అర్జున్ 20 లక్షలు ఇలా ప్రతి స్టార్ హీరో ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేసారు, చేస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఈ చారిటీకి 75,000 విరాళం ప్రకటించారు. ఆయన కొడుకు సంజయ్ రావు సైతం 25,000 సహాయం చేసారు.
అయితే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి వంటి ఒకరిద్దరు తప్పితే మిగతా హీరోయిన్లు ఎవరూ నయాపైసా చారిటీకి సహాయం ప్రకటించలేదు. దీనిపై బ్రహ్మాజీ గుస్సా అయ్యారు. ముంబై నుండి వచ్చినా ఇక్కడ స్టార్ డం సంపాదించుకునే స్టార్ హీరోయిన్లు కోట్లలో పారితోషికాలు తీసుకుంటారు. అలాంటిది వారు లక్షల్లో కాదు కనీసం వేలల్లో అయినా చారిటీ కి తమవంతు సహాయం ప్రకటించాల్సింది అంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచారు.
ఇలాంటి కష్ట సమయంలో ఎంత ఇచ్చారు అని ఎవరూ అడగరు. కనీసం మనవంతుగా ఎంతో కొంత సహాయం చేయడం మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
64237 188886hi and thanks for the actual weblog post ive recently been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 299049
579517 503347Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your weblog you may be interested in hearing. Either way, fantastic site and I appear forward to seeing it expand more than time. 963258
369319 498053Hey extremely nice weblog!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your site and take the feeds alsoIm satisfied to seek out numerous beneficial info here in the post, we want develop more techniques on this regard, thanks for sharing. 40395