‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ మళ్ళీ ఒకసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి కారణం ఆమె చేసిన వ్యాఖ్యలు.
ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, తనకు సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చి చేజారిపోయింది అని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో చివరికి అనుష్క శర్మ నటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన సమయంలో మృణాల్ చేసిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“ఆ సినిమా చేసినా నేను నన్ను కోల్పోయేదాన్ని. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను, ఆమె చేయడం లేదు. అదే నా విజయం” అని చెప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యాఖ్యలు విని నెటిజన్లు మండిపడుతున్నారు.
బాలీవుడ్ ఆడియన్స్ అనుష్క శర్మ పేరు తీసి ఇలా మాట్లాడడం సరైనది కాదని కామెంట్లు చేస్తున్నారు. “అనుష్క స్వయంగా సినిమాలు తగ్గించుకుంది కానీ స్టార్డమ్ కోల్పోలేదు. మృణాల్ రియాలిటీ చెక్ చేసుకోవాలి” అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇక ముందుగా మృణాల్ చేసిన బిపాసా బసు కామెంట్స్ కూడా పెద్ద వివాదమయ్యాయి. ఆ సమయంలో ఆమె క్షమాపణ చెప్పినా, ఇప్పుడు మళ్ళీ పాత వీడియోల వల్ల ట్రోల్ అవుతున్నారు.
మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి అభిమానాన్ని సంపాదించుకున్నా, బాలీవుడ్ నెటిజన్లు మాత్రం ఆమె మాటల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
