Switch to English

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ సంస్థ ఒకటి ఈ గుర్తింపుని ఇస్తుంటుంది.

అయితే, కొద్ది రోజుల క్రితం బీచ్‌లో సౌకర్యాల లేమి.. అంటూ, కొందరు సదరు సంస్థకు ఫిర్యాదులు చేశారు. దాంతో, తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్‌ని రద్దు చేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంకేముంది, ఈ విషయమై రాజకీయ రాద్ధాంతం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ, సోషల్ మీడియా వేదికగా కూటమిపై చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

నిజానికి, బీచ్‌లో సౌకర్యాల లేమి.. అంటూ ఫొటోలు తీసి, సదరు సంస్థకు ఫిర్యాదు చేసింది వైసీపీ మద్దతుదారులేనన్న విమర్శలున్నాయి. కారణాలేవైతేనేం, బీచ్‌కి వున్న బ్లూ ఫ్లాగ్ రద్దయ్యింది. దాంతో, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మంత్రి కందుల దుర్గేష్, వీలైనంత త్వరగా బ్లూ ఫ్లాగ్‌ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు, మంత్రి ఆదేశాలతో హుటాహుటిన, బీచ్‌లో సౌకర్యాల్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు.

కట్ చేస్తే, నెల రోజుల వ్యవధిలోనే, బ్లూ ఫ్లాగ్‌ని రిషికొండ బీచ్‌లో పునరుద్ధరించగలిగింది కూటమి ప్రభుత్వం. దాంతో, పర్యాటకులు కూటమి ప్రభుత్వం పని తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, సుందర విశాఖ తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది, పర్యాటకులకు స్వర్గధామంలా మార్చేందుకు, కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ని సిద్ధం చేస్తోంది.

రిషికొండ బీచ్‌కి ఆనుకునే, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం కోసం సుమారు 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. కొండని తొలిచి మరీ తవ్విన రిషికొండ ప్యాలెస్ చుట్టూ వున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

ఒరిజినాలిటీ చూపించాలనుకుంటున్న బుట్ట బొమ్మ..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఈమధ్య సౌత్ సినిమాల్లో దూకుడు తగ్గించింది. రాధే శ్యామ్, బీస్ట్ ఇలా వరుస సినిమాలు షాక్ ఇవ్వడంతో మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన అమ్మడికి అక్కడ కూడా...

క్రైస్తవ ధర్మ పరిరక్షణ ఎక్కడ జగన్.?

మొన్నీమధ్యన శ్రీరామ నవమి సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ‘హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్’ అంటూ ట్వీట్లు హోరెత్తాయ్. దాదాపు 17 ట్వీట్లు, జగన్ ఫొటోలతో ‘హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్’...

చంద్రబాబు పుట్టినరోజు.. తిరుమలలో 750 కొబ్బరికాయల మొక్కు..!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తిరుమలలో 750 కొబ్బరికాయలు కొట్టి, 7 కేజీల 500 గ్రాముల కర్పూరాన్ని వెలిగించారు....

సింగర్ గా మారిన కోలీవుడ్ స్టార్ సూర్య..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2D ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో సూర్య సొంతంగా ఈ మూవీని నిర్మించారు. పూజా హెగ్దే...

నితిన్ కెరీర్ ను డైసైడ్ చేయబోతున్న ‘తమ్ముడు‘.. ప్లాప్ అయితే అంతే..

యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే వరుసగా ఆరు ప్లాపులు ఉన్నాయి. మధ్యలో ఓ సినిమా హిట్ అయినా.. దానికంటే ముందు మరో మూడు ప్లాపులు ఉన్నాయి. అంటే...