1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చి వేయడం జరిగింది. మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళి మనోహర్ జోషి మరియు ఉమా భారతిల మాటలకు రెచ్చి పోయి కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేసినట్లుగా ప్రధాన ఆరోపణ. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దాదాపు 28 ఏళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసును సుదీర్ఘ కాలం విచారించిన న్యాయస్థానం నేడు తుది తీర్పును ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
ఈ కేసులో బీజేపీ మరియు సంఘ్ పరివార్కు చెందిన హేమాహేమీ నాయకులు మొత్తం 49 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికే 17 మంది మృతి చెందారు. మిగిలిన వారు విచారణ ఎదుర్కొన్నారు. వారికి నేడు శిక్ష ఖరారు అవ్వనుందా లేదంటే వారిది ఏం తప్పు లేదు అంటూ కోర్టు తీర్పు వెలువడనుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ కేసు తీర్పు నేపథ్యంలో దేశ వ్యప్తంగా సున్నిత ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. హిందూ ముస్లీంల మద్య ఘర్షణలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. నేడు తీర్పు నేపథ్యంలో అద్వానీ మరియు మురళి మనోహర్ జోషితో సహా నిందితులు అంతా కూడా కోర్టుకు హాజరు అవ్వబోతున్నారు. మరికాసేపట్లో తీర్పు ఏంటీ అనేది తేలిపోయే అవకాశం ఉంది.
976331 428022wonderful work Outstanding weblog here! Also your internet site a good deal up quickly! What web host are you the usage of? Can I get your associate link on your host? I want my website loaded up as rapidly as yours lol 335994
108248 61165I like your writing style truly loving this web site . 284849