భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గంలోకి ఇద్దరు తెలుగు మహిళలకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి డీకే అరుణ, ఏపీ నుంచి పురంధేశ్వరిలను కొత్త కార్యవర్గంలోకి తీసుకున్నారు. కొంతమంది సీనియర్లను తప్పించి వారి స్థానంలో యువనేతలు, మహిళలకు అవకాశం ఇచ్చారు. మొత్తమ్మీద యువ, మహిళ, సీనియర్ నేతలతో సమతూకమైన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తన కొత్త టీమ్ వివరాలు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురికి స్థానం లభించింది. డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన నడ్డా.. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కాగా.. ఇప్పటికే జాతీయ కార్యదర్శిగా ఉన్న ఏపీకి చెందిన సత్యకుమార్ అదే పోస్టులో కొనసాగనున్నారు. మొత్తమ్మీద 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు సహా 70 మంది ఈ కార్యవర్గం ఏర్పాటైంది. వీరిలో ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు ఉన్నారు.
మరోవైపు ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రాంమాధవ్, మురళీధర్ రావులతోపాటు అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకు ఈసారి చోటు దక్కలేదు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో రాంమాధవ్ కు చోటు లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యవర్గంలోకి ఆయన్ను తీసుకోలేదని అంటున్నారు.
కాగా కొత్త టీమ్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారంతా నిస్వార్థం, అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూ పార్టీని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడతారని ఆశిస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.
598896 401283I located your blog on yahoo and can bookmark it currently. carry on the nice function. 77419
508629 649119Largest lover messages were produced to share it along with your and gives honour with the bride and groom. Very sound systems facing unnecessary throngs of individuals really should take into account each of our valuable concept of all presenting, which is ones trailer. very best man toasts 522663