Switch to English

బీజేపీలో జోష్‌ నింపిన జగన్‌.. కారణం ఇదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్ళొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయమై చర్చించారు. మళ్ళీ ఇంకోసారి జగన్‌, ఢిల్లీకి వెళ్ళాల్సి వుంది. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కావాల్సి వుంది. అంతకన్నా ముందే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.

‘రైతు భరోసా’ పథకానికి ‘వైఎస్సార్‌ పేరుతోపాటు అదనంగా పీఎం కిసాన్‌’ని కూడా జోడించారు. తొలుత ప్రకటించినట్లు ఏడాదికి 12,500 రూపాయలు కాకుండా, రైతులకు అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి.. మొత్తంగా 13,500 రూపాయల్ని ఏడాదికి అందించబోతున్నారు.. అదీ మూడు విడతలుగా.

నిజానికి, ఇందులో కేంద్రం వాటా కూడా వుంది. ఎన్నికల ప్రచారంలో 12,500 ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే వాటాని కలుపుతామనడం ఎంతవరకు సబబు.? అన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నా.. జగన్‌ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది.

మరోపక్క, కేంద్రం ఇచ్చే నిధులతో సంక్షేమ పథకాలు చేపడుతూ, వాటికి వైఎస్సార్‌ పేరు పెట్టడమేంటి.? అన్న విమర్శలు బీజేపీ నుంచి గట్టిగానే విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, పోలవరం సహా అనేక అంశాల్లో వైఎస్‌ జగన్‌ ‘రివర్స్‌’ తీరు పట్ల కేంద్రం గుర్రుగా వుంది. సరిగ్గా ఈ టైమ్‌లో వైఎస్‌ జగన్‌, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఓ పథకానికి కేంద్రం పేరుని కూడా జోడించడం గమనార్హం.

ఇది కేవలం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికేననీ, వెయ్యి పెంచడం వెనుక పరమార్థం.. కూడా వేరే వుందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణాలేవైతేనేం.. రైతన్నకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి.

మరోపక్క, పీఎం కిసాన్‌.. అన్న పేరు కూడా పథకానికి జోడించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడితో కేంద్రం – రాష్ట్రం మధ్య పంచాయితీ చల్లారినట్లేనా.? జగన్‌ త్వరలో ఢిల్లీకి వెళ్ళి, ప్రధానితో సానుకూల చర్చలు జరుపుతారా.? రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకురాగలుగుతారా.? రివర్స్‌ వ్యవహారంలో కేంద్రాన్ని జగన్‌ ఒప్పించగలుగుతారా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...