రాజధాని అమరావతికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చేతులెత్తేసింది. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ.. అనే స్థాయిలో మాత్రమే ఏపీ బీజేపీ నేతలు కొంత హంగామా చేస్తున్నా, ఢిల్లీలో సొంత పార్టీ నేతల మాటలకే విలువ లేని పరిస్థితి. అమరావతి విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్న విషయం విదితమే. ‘మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు..’ అని ఆయన అంటున్నారు. పరిణామాల్ని కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరిస్తున్నారు.
అయితే, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశమే లేదని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తేల్చి చెప్పారు. ‘మేం పెద్దన్న పాత్ర పోషిస్తే, టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా.?’ అంటూ జీవీఎల్, టీడీపీ మీదనే ఇంకా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, జగన్ పట్ల కొంత సానుకూల ధోరణితో వున్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. అది నిజమేనని జీవీఎల్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.
ఇంతకీ, బీజేపీ జగన్ పట్ల సానుకూలంగా వుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? రాజధాని విషయంలో జనసేనతో కలిసి తమ ఉద్యమ కార్యాచరణ వుంటుందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ లిస్ట్లో జీవీఎల్ కూడా వున్నారు. కానీ, ఏం లాభం.? జీవీఎల్ దృష్టి వైసీపీని విమర్శించడం కన్నా టీడీపీని తూలనాడటం మీదే ఎక్కువగా వుంటోంది. అది పరోక్షంగా వైఎస్సార్సీపీకి అడ్వాంటేజ్ అవుతోంది.
బీజేపీ వైఖరి ఇంత స్పష్టంగా కన్పిస్తోంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం లాభం.? అన్నట్టు, కొందరు బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు.. వీటిని ఉత్తుత్తి ఆందోళనలుగా కొట్టి పారేయాలేమో.!
575582 589286Ive been absent for some time, but now I remember why I used to love this blog. Thank you, I will try and check back more often. How often you update your web internet site? 278827
459828 103728Also, weblog regularly and with fascinating material to keep individuals interested in coming back and checking for updates. 419981