ప్రముఖ మంచినీటి వ్యాపార సంస్థ బిస్లరీ కంపెనీని విక్రయిస్తున్నట్టు చైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇందులో టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ కూడా ఉందని తెలిపారు.
అయితే.. టాటా గ్రూప్ కు ఇప్పటికే బిస్లరీని విక్రయించేందుకు రూ.7000 కోట్లతో ఒప్పందం జరిగినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. మరోవైపు టాటా కంపెనీ కూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు వెల్లడించింది. తన కుమార్తె జయంతి వ్యాపార నిర్వహణపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతోనే బిస్లరీని విక్రయిస్తున్నట్టు రమేశ్ అన్నారు.
రమేశ్ చౌహాన్ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారంలో దిగ్గజం. ముప్పై ఏళ్ల క్రితమే తన సాఫ్ట్ డ్రింక్స్.. థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మజా, లిమ్ కా బ్రాండ్లను కోకా-కోలాకు బదిలీ చేశారు. వీటిలో థమ్స్ అప్ బిలియన్ డాలర్ బ్రాండ్ గా ఎదిగింది. మజా కూడా అదే దారిలో ఉంది. 2016లో చౌహాన్ బిస్లరీ ద్వారా మళ్లీ వ్యాపారంలోకి వచ్చారు.
652479 66985I conceive this internet site has very fantastic indited content material posts . 102967