బిగ్ బాస్ 5 లో బొమ్మల ఫ్యాక్టరీ కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను నాలుగు టీమ్స్ గా విభజించిన విషయం తెల్సిందే. రెడ్, బ్లూ, ఎల్లో, రెడ్ గా విభజించారు. రెడ్ టీమ్ లో శ్రీరామ్, విశ్వ, ప్రియాలు ఉండగా బ్లూలో మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్ లు ఉన్నారు. ఇక ఎల్లో టీమ్ షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక కాగా గ్రీన్ టీమ్ రవి, శ్వేతా, లోబోలు ఉన్నారు.
నిన్న గ్రీన్ టీమ్ కు ఒక స్పెషల్ పవర్ వచ్చింది. దాని ప్రకారంగా ఏ టీమ్ చేసిన బొమ్మలనైనా వారు స్వాధీనం చేసుకోవచ్చు. దాంతో ఎక్కువ ఉన్న బ్లూ టీమ్ బొమ్మలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు గ్రీన్ టీమ్. బ్లూ టీమ్ హయ్యస్ట్ లో ఉండటంతో వారి బొమ్మలను గ్రీన్ టీమ్ తీసుకున్నారు. తమ దగ్గర బొమ్మలు ఏం లేకపోవడంతో బ్లూ టీమ్ లో ఎన్నీ మాస్టర్ కొంత సహనం కోల్పోయారు. గేమ్ ఆడతాను అని చెప్పి శ్వేతా దగ్గర నుండి బొమ్మ లాక్కుని చించేశారు. ఇది శ్వేతాకు కోపం తెప్పించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిన్నటి ఎపిసోడ్ లో శ్వేతా ఇలాగే ఎల్లో టీమ్ నుండి ఒక బొమ్మను లాగేసుకుని చించేసింది. అప్పుడు నవ్వుతూ చేసిన శ్వేతా ఇప్పుడు కోపం తెచ్చుకుని ఏడ్చేయడం ఏంటో అర్ధం కాలేదు. శ్వేతా తనను అనడంతో ఈ హౌజ్ లో ఎవరితో రిలేషన్ లేదని తనకు కూతురు లేదని ఎన్నీ మాస్టర్ అన్నారు.
అలాగే గ్రీన్ టీమ్ కు మరో పవర్ వచ్చింది. ఎవరినైనా డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ ను చేయొచ్చు. సిరికి ఆ పవర్ ఇస్తానని రవి మాట ఇచ్చాడు. అలాగే బొమ్మలు తీసుకునేటప్పుడు రెడ్ టీమ్ కు కూడా ఒక పవర్ వచ్చింది. కానీ అదేంటో రివీల్ చేయనని శ్రీరామ్ చంద్ర చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో వివాదాలు కూడా బాగానే జరుగుతున్నాయి. నిన్న ఎన్నీ మాస్టర్ కు సిరికు మధ్య అరుపులు రాగా ఈరోజు సన్నీ, సిరి మీద గట్టిగా అరిచాడు. అయితే తనకు సారీ చెప్పాలని సిరి అంది. ప్రియాతో కూడా సిరికు వాగ్వాదం చేసింది. “సంచాలకులు ఏం పీకుతున్నారు” అని ప్రియా అనడంతో సిరి దానికి హర్ట్ అయింది.
ఇక శ్వేతా చేసిన మరో తప్పు కెమెరాల కంటపడ్డాయి. బిగ్ బాస్ హౌజ్ లో పిల్లోలు తెచ్చి దాన్ని కట్ చేసి ఆ దూదిను బొమ్మల్లో పెట్టడానికి వాడింది. బిగ్ బాస్ హౌజ్ ప్రాపర్టీస్ కు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదన్న విషయం తెల్సిందే. మరి ఈ విషయంలో బిగ్ బాస్ ఏదైనా కఠిన శిక్షను ఇస్తాడేమో చూడాలి.