Switch to English

టిక్కెట్ టు ఫినాలే: మరోమారు సత్తా చాటిన రోహిణి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,948FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు, ఒకర్ని మించి ఇంకొకరు హౌస్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అందరిలోకీ, రోహిణి సమ్‌థింగ్ వెరీ స్పెషల్. ఎనిమిదో సీజన్‌లో చివరి మెగా చీఫ్ అయిన రోహిణి, తాజాగా టిక్కెట్ టు ఫినాలే రేసులో మొదటి కంటెండర్‌‌గా అవకాశం దక్కించుకుంది.

గతంలో బిగ్ బాస్ సీజన్‌లో కంటెస్టెంట్లుగా వున్న అలేఖ్య హారిక, అఖిల్ సార్ధక్.. ఇద్దరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, బిగ్ బాస్ ఆదేశం మేరకు, ఎనిమిదో సీజన్ – టిక్కెట్ టు ఫినాలే రేసు కోసం కంటెండర్ల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.

ఈ క్రమంలో రెండు టాస్కుల్ని రోహిణి విజయవంతంగా పూర్తి చేసి, టిక్కెట్ టు ఫినాలే రేసులో మొదటి కంటెండర్ అయ్యింది రోహిణి. రోహణితోపాటు గౌతమ్, టేస్టీ తేజ, విష్ణు ప్రియ.. కంటెండర్ రేసు కోసం పోటీ పడినా, విజయం సాధించలేకపోయారు.

కాగా, ఈ టాస్కుల్లో ఫెయిల్ అయిన విష్ణు ప్రియకు బ్లాక్ స్టార్ ఇచ్చారు హారిక, అఖిల్. ఆ కారణంగా, టిక్కెట్ టు ఫినాలే కోసం కంటెండర్ రేసులోంచి విష్ణు ప్రియ ఔట్ అయిపోయింది.

మెగా చీఫ్ కిరీటం కోసం, కాలి నొప్పితోనూ పెర్‌ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిన రోహణికి, టిక్కెట్ టు ఫినాలే రేసు కోసం జరిగిన కంటెండర్ షిప్ విషయంలోనూ అదే బ్యాలెన్స్ బాగా కలిసొచ్చింది.

కాగా, కంటెండర్ రేసులోంచి తనను తప్పించడంపై విష్ణు ప్రియ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను సరదాగా వుండడమే తాను చేసిన తప్పా.? అని విష్ణు ప్రియ ప్రశ్నించింది కన్నీరుమున్నీరవుతూ. అయితే, తన అవకాశాన్ని వేరొకరికి ఇచ్చేయాలన్న ఆలోచన తప్ప, ఆటలో సీరియస్‌నెస్ విష్ణు ప్రియకి లేదని అఖిల్, హారిక తేల్చారు.

కంటెండర్ పోటీలో తనకు అవకాశం లేకుండా పోవడాన్ని తట్టుకోలేకపోయిన విష్ణు ప్రియను ఓదార్చేందుకు ఆమె బుగ్గ గిల్లాడు అఖిల్. అంతకు ముందు పృధ్వీ – విష్ణుప్రియ మధ్య ఏముందన్న విషయమై ఇద్దర్నీ అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు అఖిల్, హారిక.

విష్ణు తనకు స్నేహితురాలు మాత్రమేననీ, అంతకు మించి ఆమె మీద ఎలాంటి వేరే ఫీలింగ్ తనకు లేదని స్పష్టం చేశాడు పృధ్వీ. విష్ణు ప్రియ మాత్రం, పృధ్వీ అంటే తనకు ఇష్టమని చెప్పింది. ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి ఆట మీద ఫోకస్ పెట్టాలని అఖిల్, విష్ణు ప్రియకి సూచించాడు.

ఇంత జరుగుతున్నా ఇంకా రియాల్టీలోకి రాలేకపోతోంది విష్ణుప్రియ. ఆమెకి మరీ చాదస్తం ఎక్కువైపోతోంది పృధ్వీ విషయంలో.

అన్నట్టు, టిక్కెట్టు ఫినాలే రేసుకు సంబంధించి, తొలి కంటెండర్ పోటీ సందర్భంగా చేతులెత్తేశాడు టేస్టీ తేజ. కానీ, అనూహ్యంగా అతనికి అదృష్టం కలిసొచ్చింది. విష్ణు ప్రియకు బ్లాక్ స్టార్ ఇవ్వాలని అఖిల్, హారిక ఫిక్సవడంతో, అవకాశం పోతుందనుకున్న టేస్టీ తేజకి ఇంకోసారి కంటెండర్‌గా పోటీ పడేందుకు అవకాశం మిగిలే వుంది.

1 COMMENT

సినిమా

గుర్రం పాపిరెడ్డి: సహజమైన కామెడీతో ప్రేక్షకులను అలరించే చిత్రం – డైరెక్టర్...

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19న థియేటర్లకు రానుంది. డార్క్ కామెడీ జానర్‌లో, కొత్త కాన్సెప్ట్‌తో...

Chiranjeevi: ‘చిరంజీవి’ స్థాయి, స్థానమేంటో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Chiranjeevi: చిరంజీవి.. ‘ఈ పేరే చాలా పవర్ ఫుల్ కదా’ అని దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్నాడని దర్శకుడు సుకుమార్ ఓ సందర్భంలో అన్నారు. నిజమే...

శక్తివంతమైన ‘అఖండ 2’ గ్రాండ్ రిలీజ్ టీజర్ గూస్‌బంప్స్..

మాస్ మంత్రం, భక్తి వైభవం కలగలిపిన ‘అఖండ 2: ది తాండవం’ టీజర్ ప్రేక్షకుల్లో ఆతృతను మరింత పెంచింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానున్న...

BIGG BOSS 9 TELUGU E95: తనూజనే కప్ కొట్టాలని కోరుకున్న...

బిగ్ బాస్ సీజన్ 9 బుధవారం ప్రసారమైన 95వ ఎపిసోడ్ పూర్తిగా రచ్చ, టాస్క్ ట్విస్ట్‌లు, ఇంటి సభ్యుల మధ్య హీటెడ్ చర్చలతో అదిరిపోయింది. రోజు...

“వింటేజ్ మాస్ మేనియాను మళ్లీ తీసుకొస్తున్నాం!” — హీరో కార్తి

స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్...

రాజకీయం

విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు రేపు శంకుస్థాపన

విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక పురోగతి దిశగా అడుగేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, నగరంలో తన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని రేపు ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన...

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు పలు మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ నియోజకవర్గాల రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం...

పరకామణిలో దొంగతనం.! మరింతగా దిగజారిపోతున్న వైసీపీ ఇమేజ్.!

రవికుమార్ అనే వ్యక్తి, పరకామణిలో దొంగతనం చేస్తూ, దొరికిపోయాడు.! దాదాపు డెబ్భయ్ వైల రూపాయల విలువ చేసే, అమెరికన్ డాలర్లను రవికుమార్ దొంగతనం చేసినట్లు తేలింది. పాప పరిహారం కింద, దాదాపు 14...

చిన్నారి క్యాన్సర్ చికిత్సకు లోకేష్ అండ: రూ.12 లక్షల సాయం

అమరావతి: చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అనంతపురం చిన్నారి చికిత్స కోసం మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చారు. 12 ఏళ్ల కె. చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్‌కు సీఎం రిలీఫ్...

దేశంలో హిందువులే మెజారిటీ అనే భావన అసత్యం: పవన్ కళ్యాణ్

మంగళగిరిలో జాతీయ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశంలో హిందువులే మెజారిటీ అన్న భావన అసత్యమని స్పష్టం చేశారు. కులం, భాష, ప్రాంతాల వారీగా హిందూ సమాజం విభజితమైందని, ఈ...

ఎక్కువ చదివినవి

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దర్శనం

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సందర్శన విశేష ఆదరణ పొందింది. సంప్రదాయ వైభవంతో జరిగిన ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు మొదట కనకదాసుల గుడిని...

సిటీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఐదుగురిని పోలీసుల అరెస్ట్, ఊరేగింపు

నెల్లూరులో సిటీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్‌ చేశారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఇంటెల్ పెట్టుబడులపై కీలక చర్చలు: ఏపీలో ఉత్పత్తి యూనిట్ ఆశలు పెంపు

శాన్ ఫ్రాన్సిస్కో: ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలోని శాంటాక్లారాలో రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఇంటెల్ సంస్థ...

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...