బిగ్ బాస్: ఈ ఏడుపులు ఏంట్రా బుజ్జీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,217FansLike
57,764FollowersFollow

నిఖిల్ ఎందుకు ఏడ్చాడు.? యష్మీ ఎందుకు అతన్ని ఓదార్చేందుకు ప్రయత్నించింది.? అసలు యష్మి ఏడవడమేంటి.? పృధ్వీ ఓదార్చడమేంటి.? నేనెందుకు ఏడకూడదన్నట్లు నయని పావని ఎందుకు బోరున విలపించింది.? బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్ అంతా, ఏడుపులమయం.!

ఒకర్ని మించి ఇంకొకరు.. మహా నటులే.! నటులు, నటీమణులు.. వెరసి, ఈ సీజన్ పేరే ‘ఏడుపుగొట్టు సీజన్’ అని పెట్టి వుండాల్సింది. ఏడో సీజన్ కాదు కదా, పేరు కలిసొచ్చేలా ఏడుపుగొట్టు సీజన్‌ని రన్ చేయడానికి.!

చాలా సినిమాల్లో రియాల్టీ షోల మీద సెటైర్లు చూశాం. ఆ సెటైర్లకు తగ్గట్టే ఈ సీజన్ కంటెస్టెంట్లు ఏడుపుతో చెలరేగిపోతున్నారు. ఔను, ఆట తక్కువ.. ఏడుపు ఎక్కు.! దేకడం ఓ టాస్క్, చెట్టు మీద యాపిల్స్ కోయడం ఇంకో టాస్క్. వాటిల్లో గెలిచిన టీమ్‌కి యెల్లో కార్డ్స్ ఇవ్వడం, డైస్ ఇచ్చి దొర్లించమని అడగడం.. ఏంటో, ఈ మాయ.!

సందట్లో సడేమియా.. అన్నట్టు టేస్టీ తేజకీ, విష్ణు ప్రియకీ మధ్య పంచాయితీ.! ‘నేను ఇక హౌస్‌లో వుండటం వేస్ట్..’ అని పలువురు కంటెస్టెంట్లు తమ చికాకునంతా బయటపెడుతన్నారు. కానీ, బయటకు పొమ్మంటే ఎవరూ పోరు.!

ఏ టాస్క్ అయినా, ఛండాలమే.! ఎవరికీ రూల్స్ పట్టడంలేదు. సంచాలక్ ఎలాంటి పిచ్చి డెసిషన్ తీసుకున్నా.. అదే ఫైనల్. కానీ, అది ఫైనల్ అయ్యేదాకా పెద్ద రచ్చ.! ఈ క్రమంలో సంచాలక్ ముందూ వెనుకా నిర్ణయాలు తీసుకోవడం.. వీకెండ్‌లో చీవాట్లు తినడం. ఇదీ వరస.!

‘నేను చూశాను… నువ్వలా దేకావ్..’ అని రోహిణి అంటే, ‘మన టీమ్‌లో వుండి, మన ఆటనే తప్పు పడతావా.?’ అని నయని పావని గట్టిగా క్లాస్ తీసుకుంది. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగింది. చివరికి నయని పావని ఏడ్చేసింది. ఇదేం ఏడుపు మహాప్రభో.? అని బిగ్ బాస్ వ్యూయర్స్ ముక్కున వేలేసుకున్నారు.

మరోపక్క, నిఖిల్‌ని అనరాని మాట ఏదో అనేసిందట ప్రేరణ. నిఖిల్ – యష్మీ స్నేహితులు కాగా, యష్మి తన టీమ్ కోసం ఆడితే, అది నిఖిల్‌కి నచ్చలేదు. ‘ఇకపై నా గేమ్ నేను ఆడతాను.. ఏ టీమ్ తరఫునా ఆడను..’ అనేశాడు. వెర్రి మాలోకం అంటే ఇదే మరి.!

గుర్తుందా.. ఓ సీజన్‌లో యాపిల్ ఎంత పెద్ద పెంట పెట్టిందో. కౌశల్ విషయంలో యాపిల్ రచ్చ బిగ్ బాస్ రియాల్టీ షో చరిత్రలోనే అతి పెద్ద మచ్చ వేసేసింది. ఆ తర్వాత కూడా యాపిల్స్ వ్యవహారం.. నవ్వులపాలవుతూనే వుంది. ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి.

యాపిల్స్ కోయమంటే, కొమ్మలు పీకేశారు. అలా పీకొచ్చు.. అని కొందరు కంటెస్టెంట్లు కవరింగ్ ఇస్తోంటే, నబీల్ అంత గొంతేసుకుని పడ్డాడు. ప్చ్.. ప్రయోజనం లేకుండా పోయింది. అందరూ తెలుగులో మాట్లాడాలనే నిబంధన వున్నా, ఈ సీజన్‌లో ఇంగ్లీషు మాత్రమే బలంగా వినిపిస్తోంది. తెలుగు అరుదుగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది.

ఓవరాల్‌గా ఇదో గందరగోళం ఎపిసోడ్.! అరుపులు కేకలు తప్ప, కంటెంట్ అస్సలు లేదాయె.! ఏడుపుతోనే కంటెస్టెంట్లు తమ అభిమానుల నుంచి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో. ఏడుపు ఆపి, ఆట మీద ఫోకస్ పెడితే మంచిది.! కానీ, కంటెస్టెంట్లు ఎనర్జీ పెట్టి ఆడటానికి, బిగ్ బాస్ నిర్వాహకులు సరైన టాస్కులు ఇవ్వాలి కదా.?

1 COMMENT

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

తిరుమలలో పవన్ కళ్యాణ్.. స్వామివారి దర్శనం తర్వాత పెళ్లి వేడుకలో పాల్గొన్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వీబీజీ–రామ్‌జీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం నేరుగా తిరుమలకు...

క్రీడాకారుల్లో కొత్త జోష్ నింపిన లోకేష్ డిన్నర్ మీట్

కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలైట్ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ డిన్నర్ మీట్ నిర్వహించారు....

అరకులో జల్ సించాయ్ పనుల పరిశీలన.. నాగబాబు ప్రశంసలు

అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో జల్ సించాయ్ జన భాగీదారి 2.0 కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను శాసనమండలి సభ్యులు K. Nagababu మంగళవారం పరిశీలించారు. Chompi గ్రామంలో జాతీయ గ్రామీణ...

జస్ట్ ఆస్కింగ్: జోసెఫ్ రావణ్‌కీ ప్రకాష్ రాజ్‌కీ ‘లింక్’ ఏంటి.?

యూ ట్యూబర్ జోసెఫ్ రావణ్ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్నాడు. నాలుగు సార్లు అరెస్ట్.. నాలుగు సార్లూ బెయిల్.. ఐదో సారి మాత్రం, బలమైన చట్టాల...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...