Switch to English

బిగ్ బాస్: ఎట్టకేలకు పృధ్వీ వికెట్ పడింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,761FansLike
57,764FollowersFollow

పృధ్వీ శెట్టి.. ఎట్టకేలకు బిగ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ ఎనిమిదో సీజన్‌లో పృధ్వీ ఓ మిస్టీరియస్ కంటెస్టెంట్. ఓ కంటెస్టెంట్‌ని ముందుగా ప్లాన్ చేసుకోగా, అతను చివరి నిమిషంలో హ్యాండివ్వడంతో బిగ్ బాస్ నిర్వాహకులు అప్పటికప్పుడు పృధ్వీ శెట్టిని తీసుకొచ్చారన్న ప్రచారం గతంలో జరిగింది.

అయితే, పృధ్వీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యాక టాస్కుల్లో బాగానే పెర్ఫామ్ చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే, రొమాంటిక్ టచ్ ఇవ్వడంలో ఈ సీజన్ వరకూ పృధ్వీ శెట్టిదే పై చేయి మిగతా మేల్ కంటెస్టెంట్లతో పోల్చినప్పుడు. విష్ణు ప్రియతో పృధ్వీ కలిపిన పులిహోర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి, పృధ్వీతోనే విష్ణు ప్రియ పులిహోర కలిపిందని అనొచ్చు.

కారణం ఏదైతేనేం, ఇక్కడిదాకా పృధ్వీ శెట్టి రావడం ఓ వింత.. అలాగే, అతను బయటకు వెళ్ళిపోవడం ఇంకో వింత. వెళుతూ వెళుతూ, హౌస్‌లో నిఖిల్ సహా ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్.. తదితరుల్లో ఎవరో ఒకరు టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు పృధ్వీ శెట్టి.

అదే సమయంలో, రోహిణి అలాగే అవినాష్ నామినేషన్లలోకి రావాలంటూ సెటైర్లు వేశాడు. ఈ వారం రోహిణి కూడా నామినేషన్‌లోకి వచ్చింది ఎలిమినేషన్ కోసం. ఆల్రెడీ ఫైనల్ కోసం ఫస్ట్ పోటీ దారుడిగా అవినాష్ సెలక్ట్ అయిపోవడంతో, ఇంకోసారి నామినేషన్ ఎదుర్కొనే అవకాశం లేకుండా పోయింది అవినాష్‌కి.

గతంలో అవినాష్ నామినేట్ అయ్యాడు, ఎలిమినేట్ అయిపోయే పరిస్థితిలో ‘షీల్డ్’ అతన్ని కాపాడింది. ఆ షీల్డ్ నబీల్ ఇచ్చాడు. వెళ్ళిపోతూ ఆ షీల్డ్ ప్రస్తావన తీసుకొచ్చి, అవినాష్‌ని అవమానించాడు పృధ్వీ. మొదటి నుంచీ అవినాష్ అన్నా, రోహిణి అన్నా.. ఆఖరికి గౌతమ్ అన్నా కూడా పృధ్వీకి నచ్చేది కాదు.

ఇదిలా వుంటే, పృధ్వీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడాన్ని విష్ణుప్రియ జీర్ణించుకోలేకపోయింది. గతంలో రాహుల్ – పునర్నవి తరహాలో పృధ్వీ – విష్ణు మధ్య ట్రాక్ నడిచింది. అయితే, రాహుల్ – పునర్నవి ట్రాక్ క్యూటుగా వుంటే, పృధ్వీ – విష్ణు మధ్య ట్రాక్ ఎబ్బెట్టుగా తయారైంది.

నిజానికి, ప్రతికూల పరిస్థితుల్లోనూ రోహిణి, మెగా చీఫ్ టైటిల్ గెలుచుకుని, తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఆమె నామినేషన్‌లోకి రావాలనుకోవడం, పృధ్వీ అమాయకత్వం. అవినాష్ – షీల్డ్.. ఇదంతా ఓ ఫేక్ వ్యవహారమని అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే కాదు పృధ్వీ.

అవినాష్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.. టాస్కుల్లోనూ బాగా పెర్ఫామ్ చేశాడు. అసలంటూ అవినాష్, రోహిణి లేకపోతే, ఈ సీజన్ అత్యంత చప్పగా సాగేదేమో.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌కి కాస్తో కూస్తో వ్యూయర్స్ వున్నారంటే అదంతా రోహిణి – అవినాష్ ఎంటర్టైన్మెంట్ వల్లే.!

బయటకు వెళ్ళాక నాలుగు ఫోన్లు తీసుకుని ప్రేరణ, నిఖిల్, నబీల్, విష్ణు ప్రియలకు ఓట్లు వేస్తానని పృధ్వీ చెప్పడం ఒకింత ఆసక్తికరం.

సినిమా

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

రాజకీయం

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

ఎక్కువ చదివినవి

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖేశ్ కుమార్...

ఓటీటీలో రాబిన్ హుడ్ కు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..

నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైనప్పటి నుంచి...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేపింది....