బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఎవరు టిక్కెట్ టు ఫినాలే గెల్చుకుంటారన్నది నేడు తేలిపోపుంది. ప్రస్తుతం వున్న ఈక్వేషన్స్ని బట్టి చూస్తే ఆది రెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలుచుకునే అవకాశముంది. దీనికి సంబంధించిన టాస్కుల్లో ఆది రెడ్డి ముందంజలో కనిపిస్తున్నాడు.
‘ప్రతిసారీ నన్నే ఎందుకు బలి చేస్తారు.?’ అంటూ ‘ఏకాభిప్రాయంతో టిక్కెట్ టు ఫినాలె నుంచి తప్పించండి’ అంటూ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చూపించడంపై రేవంత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇనాయా సైతం, ఈ లిస్టులో నేనూ చాలాసార్లు బలైపోయానంటూ వాపోయింది. ఎవరో ఒకర్ని మీరే డిసైడ్ చేసెయ్యండి బిగ్ బాస్.. అంటూ దాదాపు అందరు కంటెస్టెంట్లూ బిగ్ బాస్ని కోరారు.
కాగా, ఓ టాస్క్ సందర్భంగా కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్ల వీపుల మీద రంగులు పూసే క్రమంలో హోరాహోరీ పోరు జరిగింది కీర్తి, ఇనాయా మధ్య. ఈ టాస్క్లో కీర్తి గెలిచింది. కీర్తి వేలికి గాయం నేపథ్యంలో ఇనాయా కొంత జాగ్రత్తగా ఆడటమే అందుకు కారణం.
మరోపక్క, హౌస్లో శ్రీసత్య అసహనానికి గురైంది. ఆహారం తినే ప్లేటుని విసురుగా పెట్టింది. దాన్ని గమనించిన శ్రీహాన్ ఆమెతో వాదోపవాదానికి దిగాడు. తినే తిండి మీద కాదు, ప్లేటు మీద కోపం చూపించానంటూ శ్రీసత్య వ్యాఖ్యానించింది.
షరామామూలుగానే రేవంత్ తరచూ కంటెస్టెంట్లకు క్లాసులు పీకుతూ వున్నాడు. కీర్తి మీద ఇనాయా గెలిచి వుండాల్సిందంటూ ఇనాయాతో చెప్పాడు. దాన్ని ఇనాయా లైట్ తీసుకుంది. ఇంకో టాస్క్లో బాల్స్తో కంటెస్టెంట్ల ఆట ఏమంత రంజుగా సాగలేదు.
సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తాను టాప్ ఫైవ్లో వుండి తీరాలనుకుంటున్నాననీ, ఒకటి రెండు వారాలు తప్ప, మిగతా అన్ని వారాలూ వంద శాతం ఎఫర్ట్ పెట్టాననీ, బిగ్ బాస్ హిస్టరీలో ఇంతవరకు సామాన్యులెవరూ టాప్ ఫైవ్లోకి వెళ్ళలేదనీ, ఆ అవకాశం తనకివ్వాలని బిగ్ బాస్ని ఆదిరెడ్డి వేడుకున్నాడు. మరి, ఆదిరెడ్డికి ఆ అవకాశం దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.
48706 531370you use a wonderful blog here! do you wish to earn some invite posts on my small weblog? 584080
779500 453419hello!,I like your writing so much! 794911