అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని వెలుగులోకి వచ్చింది. టికెట్లు మరియు ఇతర పూజలకు సంబంధించి ఆన్ లైన్లో భక్తులు చెల్లించే డబ్బును కొందరు సాఫ్ట్వేర్ను మార్చేసి కోట్లు కొల్లగొట్టారు.
ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు. శ్రీశైలం ఆలయంలో అవినీతి జరిగిన మాట వాస్తవమే అంటూ ఈవో రామారావు పేర్కొన్నారు. 150 రూపాయల టికెట్ల బుకింగ్లో కోటి రూపాయలు, 1500 రూపాయల అభిషేకం టికెట్ల బుకింగ్ లో 50 లక్షలు, కాటేజ్లు బుకింగ్స్కు సంబంధించి మరో 50 లక్షలు కాజేసినట్లుగా అధికారులు గుర్తించారు.
ఇంకా మహ మంగళహారతి, కంకణాలు, వివిధ దర్శనాలకు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలను స్వాహా చేశారు. అయితే ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ తమకు సంబంధం లేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈవో రామారావు ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
466519 651382I like what you guys are up too. Such smart function and reporting! Carry on the superb works guys Ive incorporated you guys to my blogroll. I believe it will improve the value of my internet site 703852