పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులు బలం మరియు బలహీనత అవుతున్నారు. రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులు బలహీనతగా మారుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం పేరుతో ఫాన్స్ వార్ కి సోషల్ మీడియా ద్వారా కొందరు చేస్తున్న హడావుడి కారణంగా జనసేన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం సినిమాలు చేస్తున్నారు, పార్టీ నిర్మాణం కోసం డబ్బు సంపాదిస్తున్నారు. ఆయన కోసం ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల నిలవలేక పోతున్నారు.
ఈ సమయంలో ఫ్యాన్స్ ఆయనకు అండగా నిలవకున్నా పర్వాలేదు కానీ ఇబ్బంది కలిగించేలా ఫ్యాన్స్ వార్ కి తెర తీయొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త మారి ఆయనకు రాజకీయంగా ప్రయోజనం కలిగేలా చేస్తారేమో చూడాలి.