పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జల్ పాయ్ గుడి జిల్లా దోహౌమోనీ వద్ద గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని బికనీర్ నుంచి బయలుదేరిన రైలు పాట్నా మీదుగా గౌహతి వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 12 బోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. రైలు వేగం, ప్రమాద ధాటికి భోగీలన్నీ ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. ప్రమాదం సమయంలో రైలులో 1200 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారు. బోల్తా పడిన భోగీల్లో ప్రయాణికులు చిక్కకుపోయారు. రెస్క్యూ సిబ్బంది, 51 ఆంబులెన్సులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయ సహకారాలు అందించాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో భోగీలను కట్ చేసి ప్రయాణికులను రక్షించారు. మృతులకు రైల్వే శాఖ 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.