Switch to English

బీసీసీఐకి దేశభక్తి లేదా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి దేశ ప్రయోజనాల పట్టవా? ప్రజల మనోభావాల కంటే మనీయే ముఖ్యమా? ప్రస్తుతం ఇవే సందేహాలను పలువురు లేవనెత్తుతున్నారు. దుబాయ్ లో నిర్వహించ తలపెట్టిన ఐపీఎల్ కు చైనా కంపెనీ వీవో ను ప్రధాన స్పాన్సర్ గా కొనసాగించాలన్న బోర్డు నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో తొండాట ఆడుతూ భారత్ ను కబళించాలని చూస్తున్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనాకు చెందిన పలు యాప్ లను భారత్ నిషేధించింది. అలాగే చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని నినాదం కూడా ఊపందుకుంది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చైనాకు చెందిన వీవో కంపెనీనే ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

బీసీసీఐకి డబ్బు ఒక్కటే ముఖ్యమా? దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రత, వారి మనోభావాలు పట్టవా అని పలువురు మండిపడుతున్నారు. ఏడాదికి వీవో చెల్లించే రూ.440 కోట్ల కోసం దేశ పరువు ప్రతిష్టలను పణంగా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అఖిలభారత వర్తకుల సమాఖ్య నిరసన వ్యక్తంచేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించేలా బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాసింది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వోకల్ ఫర్ లోకల్ అని, ఆత్మ నిర్బర్ భారత్ అని స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుండగా.. బీసీసీఐ మాత్రం అందుకు విరుద్దమైన నిర్ణయం ఎందుకు తీసుకుందని అందులో ప్రశ్నించారు. ఇక జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో విరుచుకుపడ్డారు. ఓవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెబుతూ.. మరోవైపు ఆ దేశానికి చెందిన ఫోన్ కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్ గా ఎలా కొనసాగిస్తారని మండిపడ్డారు.

డ్రాగన్ ను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే, బీసీసీఐ తీసుకున్న ఇలాంటి నిర్ణయం వల్ల ఆ దేశం మనల్ని అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. అలాగే ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రపంచం మొత్తం చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తుండగా.. ఐపీఎల్ మాత్రం వారికి ఆశ్రయం ఇస్తోందని మంచ్ జాతీయ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలోనైనా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...