నందమూరి బాలకృష్ణ వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా సినిమాలు చేసుకుంటూనే పోతున్నాడు. గత రెండేళ్లుగా బాలయ్యకు సక్సెస్లు లేవు. అయినా కూడా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కరోనా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య బోయపాటి మూవీ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ రెండవ లేదా మూడవ వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో బాలయ్య తదుపరి చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. అప్పుడే బాలయ్య తదుపరి చిత్రానికి ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈసారి బాలయ్య మలయాళ రీమేక్పై ఆసక్తి కనబర్చుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ ను బాలయ్య రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడట. అయ్యప్పనుమ్ కొశియుమ్ చిత్రంలో బిజు మీనన్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించారు.
తమిళంలో ఈ చిత్రం రీమేక్లో సూర్య ఇంకా కార్తీలు నటించబోతున్నారట. తెలుగులో ఈ సినిమాను బాలకృష్ణ ఇంకా కళ్యాణ్ రామ్లు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయ్యప్పనుమ్ కొశియుమ్ చిత్ర రీమేక్ రైట్స్ను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నాడు. ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ రీమేక్ రైట్స్ను ఆయనతో కొనిపించినట్లుగా తెలుస్తోంది. మరి సినిమా రీమేక్ కోసం నాగవంశీ ఎవరిని సంప్రదిస్తున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. ఒక వేళ బాబాయి అబ్బాయి బాలయ్య, కళ్యాణ్ రామ్లు కలిసి నటిస్తే నందమూరి ఫ్యాన్స్కు పండుగే.
233430 308679Excellently written article, doubts all bloggers offered the same content because you, the internet is a greater location. Please keep it up! 162911
113800 319439It is onerous to search out knowledgeable individuals on this topic, nonetheless you sound like you already know what you are talking about! Thanks 369116