సీనియర్ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణలు నివాళులు సమర్పించారు.
తెల్లవారు జామునే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇంకా పలువురు కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అధికార పగ్గాలు చేపట్టి సంక్షే పథకాలు ప్రారంభించి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు అంటూ బాలయ్య పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ గారి కుమారుడిగా జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.