Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. పదేళ్లుగా ఇదిగో ఎంట్రీ.. అదిగో ఎంట్రీ అని గాసిప్స్ గట్టిగానే నడిచినా నిజం కాలేదు. కానీ, ఈసారి ఈఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా ఆదిత్య 369 నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ తెరకెక్కించనున్నారని.. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోందని టాక్.
మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడిచింది. అయితే.. ప్రాజెక్ట్ పక్కకి వెళ్లి ఆదిత్య 999 మ్యాక్స్ ముందుకొచ్చిందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీని క్రిష్ జాగర్లమూడికి అందించినట్టు సమాచారం. బాలయ్యే స్వయంగా అందించిన కథకు తుది మెరుగులు దిద్దడం పూర్తయిందని.. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. మరి.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మాట ఈ ఏడాదైనా నిజమవుతుందేమో చూడాల్సిందే.
