సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెషన్ హాల్లో సెలబ్రేషన్స్ నిర్వహించింది. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ సందడిగా జరిగింది. బాలకృష్ణ తనదైన శైలిలో హుషారు తెప్పించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. అయితే.. ఫంక్షన్ కు సంబంధించి ఓ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఫంక్షన్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన హనీ రోజ్ తో బాలకృష్ణ షాంపేన్ తాగుతున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ-హనీ రోజ్ ఒకరికొకరు.. తమ చేతులను కలిపుకుంటూ షాంపేన్ తాగుతూ చిల్ అవుతున్న ఫొటో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పిక్ చూసి బాలయ్య స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Really it is special treat for Bala krihna and his fans
991071 397150Yay google is my world beater assisted me to find this wonderful internet site! . 512088