బకాసుర రెస్టారెంట్‌ గురించి దర్శకుడు ఏమంటున్నారంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,491FansLike
57,764FollowersFollow

దర్శకుడు ఎస్‌జే శివ దర్శకత్వంలో కమెడియన్ ప్రవీణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడ రామ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు.

దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ, “బకాసుర రెస్టారెంట్ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇప్పటి వరకు తెలుగులో చూడని కొత్త జానర్ ఇది. యమలీల, ఘటోత్కచుడు సినిమాల తరహాలో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతి కలిగించే కథ. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఎలా ఉంటుందో చూపించే కథ ఇది. హారర్, కామెడీ, ఎమోషన్ అన్నీ మిక్స్ అయిన ప్యాకేజ్ ఇది” అని తెలిపారు.

హీరోగా ప్రవీణ్ ఎంపికపై శివ మాట్లాడుతూ, “మొదట ఇతర హీరోలతో చర్చించాం. కానీ వాళ్లందరూ సోలో హీరో సినిమాలకే ఆసక్తి చూపారు. అప్పుడు ప్రవీణ్‌ను కలిశాం. ఈ కథ విన్న వెంటనే ఆయనే ఈ సినిమా చేయాలని ఒప్పుకున్నారు. ఇది ఐదుగురు బ్యాచిలర్ల కామెడీ స్టోరీ” అన్నారు.

తన బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుతూ శివ, “నేను లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివాను. విరూపాక్ష చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. మా నాన్న సినిమాలు నిర్మించారు. ఆయన కోరిక నెరవేర్చడానికే నేను దర్శకుడిగా మారాను” అని చెప్పారు.

దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు. “శిరీష్ గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ఎస్వీసీ వంటి పెద్ద సంస్థ మా సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది” అన్నారు.

బడ్జెట్ గురించి శివ మాట్లాడుతూ, “స్టార్స్ లేకుండా పెద్ద బడ్జెట్ ఎందుకు? అని కొందరు అడుగుతారు. కానీ మేము కథను నమ్మి సినిమా తీశాం. పెద్ద హీరోలకు ఇచ్చే పారితోషికాన్ని మేము మేకింగ్‌లో పెట్టాం. క్వాలిటీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు” అన్నారు.

“ప్రేక్షకులకు వారి బ్యాచిలర్ లైఫ్ గుర్తు చేసే కథ ఇది. హర్ష బకాసుర పాత్రలో కనిపిస్తాడు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది” అని దర్శకుడు తెలిపారు.

భవిష్యత్‌లో విఠలాచార్య స్టైల్ సినిమాలు తీయాలనే కోరిక ఉందని, ప్రస్తుతం ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. “బకాసుర రెస్టారెంట్ పార్ట్ 2 ఉండదు. ఈ కథలోనే బకాసుర పాత్ర ముగుస్తుంది” అని స్పష్టం చేశారు.

తన లక్ష్యం గురించి మాట్లాడుతూ, “చాలా తక్కువ రోజుల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం. పూరీ గారు నా ఆదర్శం. మా సినిమా 5 కోట్లతో తీసి 12 కోట్ల విలువైన అవుట్‌పుట్ చూపిస్తాం” అని శివ తెలిపారు.

సినిమా

పెద్ది బడ్జెట్.. ₹350 కోట్లతో రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

Ram Charan హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా గురించి ఇండస్ట్రీలో మరోసారి భారీ చర్చ మొదలైంది. తాజాగా నిర్మాత సినిమా బడ్జెట్ సుమారు ₹350 కోట్ల...

పెద్ది రన్‌టైమ్ ఫిక్స్.. చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ వస్తుందా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ...

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

రాజకీయం

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

ఎక్కువ చదివినవి

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...

Daily Horoscope: మిథున రాశివారికి శుభవార్తలు.. ధనుస్సు రాశివారికి ప్రయాణ యోగం!

మే 10 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం వంటి విషయాల్లో జాగ్రత్తలు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...