Switch to English

బాబూ రాజేంద్రా.. మరీ ఇంత అడ్డంగానా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా? చంద్రబాబు భజనపరుల్లో ఈయన ఒకరు. తమ అధినేతపై ఈగ వాలనివ్వరు. టీవీ చర్చల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఈయన హల్ చల్ చేశారు. ఈనెల 24న ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు శనివారం ఏర్పాట్లు చేస్తుండగా.. బాబూ రాజేంద్ర ప్రసాద్ అక్కడకు వచ్చారు. తమ అనుమతి లేకుండా అక్కడ సదస్సు ఎలా నిర్వహిస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు.

ప్రజావేదికను ఉపయోగించుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారని, దానిపై తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఇలా ఖాళీ చేయించడం తగదని వాదించారు. అయితే, రాజేంద్రప్రసాద్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనం అని, గతంలో అక్కడ కలెక్టర్ల సదస్సు నిర్వహించేవారని, అదే తరహాలో ఇప్పుడు కూడా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్లు ఏవీ బయట పడేయలేదని, తాము కేవలం సదస్సు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి సానుభూతి పొందాలనే కారణంతోనే బాబూ రాజేంద్రప్రసాద్ ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తిని ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఖాళీ చేయకుండా, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం మరొకటి ఉండదంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయడం ఆ పార్టీ కనీస బాధ్యత అని, అలా చేయకుండా ప్రభుత్వ అధికారులనే బెదిరించడం ఏమిటని అంటున్నారు.

ఇందుకు బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పే కారణం ఒక్కటే. తమ నాయకుడు ఆ ప్రజావేదికను తనకు కేటాయించమని కోరారని, దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వని నేపథ్యంలో, సర్కారు నుంచి జవాబు వచ్చేవరకు తాము అక్కడే ఉంటామని వాదిస్తున్నారు. ప్రజావేదికలో తమ నాయకుడు చంద్రబాబు ఛాంబర్ ఉందని, అందులో బోలెడు విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయని, అవి పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తాము లేని సమయంలో అక్రమంగా లోపలకు వచ్చిన ప్రభుత్వంపై దొంగతనం కేసు పెడతానని ఆయన హెచ్చరించడం కొసమెరుపు. బాబూ రాజేంద్ర ప్రసాద్ వైఖరి చూసిన పాత్రికేయులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ఇంత అడ్డంగా వాదిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు.

4 COMMENTS

సినిమా

హాస్యం.. అపహాస్యం.. తేడా తేలీదా రాజేంద్రా..!

ఎదుటి వాళ్లకి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు. అది పెద్దవాళ్లైనా చిన్న వాళ్లైనా. అదే ఇంగ్లీష్ లో అంటారు కదా గివ్ రెస్పెక్ట్...

శ్రీలీలను డామినేట్ చేసిన కెతిక శర్మ..!

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు....

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి...

Ram Charan Birthday Special: ‘ఆరెంజ్’ మూవీ మ్యాజిక్.. రీ-రీ-రిలీజులతో రికార్డులు

Ram Charan: ప్రతి హీరో కెరీర్లో ప్రేమకథల సినిమాలు ఉంటాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న రామ్ చరణ్ కూడా ప్రేమకథలో నటించారు. కానీ, ఆ...

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు...

రాజకీయం

మాజీ మంత్రి విడదల రజనీకి అరెస్టు భయం.! అస్సలు లేదట.!

‘ఏం చేస్తారు.? మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.?’ అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ. ఒకప్పుడు తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కనని చెప్పుకున్న విడదల రజనీ,...

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

ఎక్కువ చదివినవి

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

Ram Charan Birthday Special: ‘ఇంతై.. ఇంతింతై..’ తెలుగు సినిమాపై రామ్ చరణ్ హవా..

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఆయనకు ధీటైన వారసుడిగా అటు ఫ్యామిలీ, ఇటు సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. తొలి సినిమా ‘చిరుత’లోనే నటనలో...

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 మార్చి 2025

పంచాంగం తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు...