సాక్షిపై దాడి.! టీడీపీ కార్యాలయంపై దాడి.! అభిమానస్తుల బీపీ, షుగర్.. వల్లే కదా జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న టీడీపీ కార్యాలయ సిబ్బందిని ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే వుంటాయి.

‘అభిమానస్తులకు బాధ కలిగింది.. మన మీద అభిమానం పెంచుకున్నవాళ్ళు.. వారంతా. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే, వారికి కోపమొస్తుంది. బీపీ, షుగర్.. ఇవి పెరిగి, బాధతో దాడి చేశారు. అందులో తప్పేముంది.?’ అంటూ, అప్పట్లో ఆ దాడిపై, అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.

కట్ చేస్తే, ఇప్పుడు వైసీపీ సొంత పత్రిక సాక్షికి చెందిన కార్యాలయానికి అమరావతి మహిళల ‘సెగ’ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగినట్లు, ఇక్కడ సాక్షి కార్యాలయంలో ఎవరికీ ప్రాణ హాని జరగలేదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం గగ్గోలు పెడుతున్నారు.. దారుణం జరిగిపోయిందని ఆరోపిస్తూ.

అక్కడ, అభిమానస్తులకు బీపీ వచ్చినప్పుడు.. ఇక్కడ అభిమానస్తులైన మహిళలకు బీపీ రాకూడదా.? పైగా, ఇక్కడ మహిళలు, తమ ఆత్మగౌరవం కోసం నినదించారు, వైసీపీ కార్యాలయానికి నిరసన సెగ తగిలించారు.

నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్నట్లుగా తయారైంది పరిస్థితి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై ఆనాడు దాడికి వైసీపీ అధినాయకత్వం వ్యూహ రచన చేసి వుండకపోతే, ఈ రోజు పరిస్థితి ఇంకోలా వుండేది.

ఏదిఏమైనా, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం వుండకూడదు. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. అలానే, మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయాలకు అమ్ముడుపోయే మీడియా సంస్థలు, అమరావతిపై చేసిన జుగుప్సాకరమైన రాజకీయానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాయి.

సాక్షి యజమానికగా జగన్, ఆయన సతీమణి భారతి.. ఒక్క క్షమాపణ చెప్పి వుంటే, ‘వ్యభిచార ముద్ర వేసుకోవాల్సి వచ్చింది’ అనే ఆవేదన అమరావతి మహిళలో కాస్తయినా తగ్గి వుండేది.

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

ఫ్రంట్‌పేజీలో సర్కారీ టాలెంట్… లోకేశ్‌ నిర్ణయానికి ప్రశంసల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో పత్రికల ఫ్రంట్‌పేజీలో ప్రత్యేక...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

Power Peta: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’.. జోష్ లో మెగా ఫ్యాన్స్.. కారణమిదే..

Power Peta: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పవర్ పేట’. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది....

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్...

“తెలియకుండానే అవుట్?: ‘AK47’లో మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై షాక్ ట్విస్ట్”

Venkatesh Daggubati హీరోగా, Trivikram Srinivas దర్శకత్వంలో రూపొందుతున్న AK47 సినిమాకు సంబంధించి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా Harshavardhan Rameshwar మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసిందే....