టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు చలానాలు కూడా కట్టించుకుని ఇప్పుడు వేసవి రద్దీ అంటూ బస్సులు ఇవ్వమనడం దారుణమని అన్నారు. మహానాడుకు వాహనాలు ఇస్తే సీజ్ చేస్తామని ఆర్డీఓలు భయపెడుతున్నారని.. వారి వివరాలు సేకరించామని భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండులా టీడీపీ కార్యకర్తలు మహానాడుకు హాజరై విజయవంతం చేయడం ఖాయమని అన్నారు.
బస్సులు ఇవ్వకపోతే బైక్, ట్రాక్టర్.. అవసరమైతే నడచి వెళ్తామని అన్నారు. జగన్ సభలకు ప్రయాణికులను ఇబ్బందిపెట్టి మరీ బస్సులను నడపటం లేదా.. అని ప్రశ్నించారు. 40ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రేణులు మహానాడుకు సమాయాత్తమవుతున్నాయని అన్నారు. మూడేళ్ల వైసీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రజానీకం విసిగిపోయారని అన్నారు. ప్రజల్లో వచ్చిన మార్పు చూసే వైసీపీ భయపడుతోందని.. అందుకే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహానాడు విజయవంతం కాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు.
177598 928289An attention-grabbing discussion is worth comment. I believe which you ought to write much more on this matter, it wont be a taboo subject nevertheless usually persons are not sufficient to speak on such topics. Towards the next. Cheers 432863
775778 557695I always was concerned in this topic and stock nonetheless am, regards for posting . 796637