Switch to English

చట్టసభలంటే ఇంతేనా.? ఇలాగేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

చట్ట సభలంటే ప్రజల్లో ఏహ్యభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. చట్ట సభ విషయమై ప్రజల్లో క్రమంగా అసహనం కూడా పెరిగిపోతోంది. చట్ట సభలతో తమకేంటి సంబంధం.? అన్నట్టు ప్రజలూ ఓ నిర్వేదానికి వచ్చేస్తున్నారు. ఎన్నికలొస్తాయ్.. ఎవరో ఒకరు గెలుస్తారు, పరిపాలిస్తారు.. అంతే.!

గెలిచినోళ్ళు చట్ట సభల్లో ఏం మాట్లాడతారు.? ఓడినోళ్ళు చట్ట సభల్లో ఎలా వ్యవహరిస్తారు.? అన్న విషయమై జనాలకి పెద్దగా అంచనాలు లేకుండా పోతున్నాయి. అసలు చట్ట సభల్లో చర్చ ఎక్కడ జరుగుతోంది.? గత కొంతకాలంగా చట్ట సభలంటే, ప్రభుత్వ పెద్దల భజన కోసం ఉద్దేశించిన వ్యవహారంగా మారిపోయింది.

అధికారంలో వున్నోళ్ళు కొత్తగా చట్టాలేమైనా చెయ్యాలంటే, అవి ప్రజలకు అవసరమా.? కాదా.? అన్న ఆలోచనతో కాకుండా, తమకు ఎంతవరకు ప్రయోజనం అన్న కోణంలోనే పాలకులు వ్యవహరిస్తున్నారనే విమర్శ ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయా చట్టాల రూపకల్పనలో ప్రభుత్వలో వున్నవారు వ్యవహరిస్తున్న తీరు, దానికి తోడు ప్రతిదానికీ అడ్డు తగిలే విపక్షాల వ్యవహారం.. వెరసి, చట్ట సభల లక్ష్యం నీరుగారిపోతోంది.

కేంద్రం కొత్తగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఆ తర్వాత రద్దవడం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడు రాజధానుల కోసం చేసిన చట్టాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం.. ఇవన్నీ ప్రభుత్వాల్ని నడుపుతున్నవారి ‘అజ్ఞానం’ కారణంగానేనన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

చట్ట సభల్లో చర్చ జరగాలి. మంది బలంతో అధికార పార్టీ ‘బుల్డోజ్’ చేసేస్తే, వ్యవహారం ఇలాగే వుంటుంది. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారంలో వున్నవారు ఆలోచించుకోవాలి. ప్రజల మెప్పు పొంది అధికారంలోకి ఎలా రావాలో విపక్షాలు ఆలోచించుకోవాలి. అలా సదుద్దేశ్యంతో రాజకీయ పార్టీలు ఆలోచనలు చేసినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది.

కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడూ సరైన చర్చ జరగలేదు.. వాటి రద్దు సమయంలో అయితే అసలు చర్చే జరగలేదు. మూడు రాజధానుల విషయమై రాష్ట్ర అసెంబ్లీలో సరైన చర్చ జరగలేదు.. రద్దు సందర్భంగానూ అదే పరిస్థితి.

ఒకవేళ కొత్త సాగు చట్టాలపై పార్లమెంటులో జరగాల్సిన స్థాయిలో చర్చ జరిగి వుంటే, ఆ చట్టాల్ని వెనక్కి తీసుకునే దుస్థితి మోడీ సర్కారుకి వచ్చి వుండేది కాదు. మూడు రాజధానుల వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కారు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించి వుంటే.. రాష్ట్ర ప్రజలూ మూడు రాజధానులకు ‘సై’ అనేవారే.

చాలా అంశాల్లో పాలకులు ‘సోయ’ కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోందా.? అనే అనుమానం ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నారంటే.. వారి ఆవేదన అర్థం చేసుకోదగ్గదే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...