అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించిన శివం భజే చిత్రం ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టీజర్ మరియు ట్రైలర్ విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సినిమా విడుదల నేపథ్యంలో హీరో అశ్విన్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ… హిడింబ సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అయితే ఏదైనా కొత్తగా చేయాలని భావించాను. అందుకే చాలా కథలను వదులుకున్నాను. కొత్త పాయింట్ తో సినిమా చేయాలని భావించాను. అప్పుడే శివం భజే కథ విన్నాను. ప్రేక్షకులకు నచ్చే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
ఈ సినిమాలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అనే కాన్సెప్ట్ కి ఈ సినిమా దగ్గరగా ఉంటుంది. హిడింబ మాదిరిగా ఈ సినిమాలో చాలా కొత్త పాయింట్ ను టచ్ చేయడం జరిగింది. చాలా స్టైలీష్ యాక్షన్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు.
హిడింబ సమయంలో సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు మాత్రం చాలా పాజిటివ్ గా స్పందించారు. ముఖ్యంగా సినిమాలోని పాయింట్ ను వారు మెచ్చుకున్నారని అశ్విన్ బాబు పేర్కొన్నాడు.
