Switch to English

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ లేకుండా పోయింది తెలుగునాట.

ఇక, సీపీఐ నారాయణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కానీ, ఆయన తరచూ వార్తల్లో వుండేందుకు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. బిగ్ బాస్ పేరుతో అక్కినేని నాగార్జున మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా, చిరంజీవి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా.. అదేదో తనకు మాత్రమే సాధ్యమని విర్రవీగుతుంటారు నారాయణ.

చికెన్ నారాయణ, ఇడ్లీ నారాయణ.. ఇలా చాలా పేర్లున్నాయి సీపీఐ నారాయణకి.! కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు నారాయణ. అయితే, అదే నారాయణకి ఓ మహిళ నుంచి నిలదీత ఎదురైంది. అది అప్పట్లో ఓ సంచలనం.

‘చిరంజీవి వల్ల నా కొడుకు బతికాడు.. ఓ ప్రాణం నిలబెట్టారు చిరంజీవి. ఆయన మీద మీరెలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారు.?’ అని నారాయణని నిలదీసింది ఆ మహిళ. ‘రాజకీయాల్లో విమర్శలుంటాయి. కానీ, నేను హద్దులు దాటాను. తప్పు సరిదిద్దుకున్నాను..’ అని నారాయణ అప్పటికే తాను క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆ మహిళతో చెప్పారు.

చాలా కాలం తర్వాత చిరంజీవి తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నారాయణ పేరుని ప్రస్తావించలేదుగానీ, ఓ రాజకీయ నాయకుడు అవాకులు చెవాకులు పేలారంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం, సదరు మహిళ నిలదీయడం గురించి ప్రస్తావించడంతో.. విషయం నారాయణ మీదేనని అందరికీ అర్థమయ్యింది.

‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను నిర్వహిస్తున్నారు చిరంజీవి. కోవిడ్ కష్ట కాలంలో, ఆక్సిజన్ బ్యాంకుల్నీ చిరంజీవి నిర్వహించిన సంగతి తెలిసిందే. రక్త దానంతో వందలాది కాదు, వేలాది లక్షలాది ప్రాణాలు గడచిన కొన్నేళ్ళలో కాపాడబడ్డాయి. వేలాది మందికి చూపు దక్కింది. ఆక్సిజన్ బ్యాంకులు నిలబెట్టిన ప్రాణాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే.

ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, నటుడిగా అత్యున్నత స్థానంలో కొనసాగుతున్నా.. చిరంజీవి మీద బురద చల్లడం అన్నది చాలా తేలికైపోయింది కొందరికి. ఎందుకంటే, చిరంజీవి ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందించరు. ‘వాళ్ళ పాపం వాళ్ళకే..’ అని వదిలేస్తుంటారు.

రోజులు మారాయ్. అడ్డగోలు విమర్శల తీవ్రత పెరిగింది.. ఆపై ట్రోలింగ్ తాకిడి కూడా చాలా దారుణంగా వుంది. సుతిమెత్తగా వ్యవహరిస్తే కుదరదిక్కడ. మెగా కాంపౌండ్ నుంచి కొన్ని విషయాలపై కౌంటర్ ఎటాక్, అంతే తీవ్రంగా వుండాల్సిందేనన్నది సగటు మెగాభిమానుల వాదన.

ఎవరి పాపాన వారు పోతారు.. అని చిరంజీవి బలంగా నమ్ముతారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అలాంటివారు చిమ్మే విషం.. చాలా నష్టాన్ని కలిగిస్తుందనీ. మెగాభిమానులు వాపోతున్నారు..

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా...

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 మార్చి 2025

పంచాంగం తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు,...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...