AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. ‘రామాయణ’కు హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ తో కలిసి ఆయన సంగీతం అందిస్తున్నారు. హాన్స్ జమ్మర్ తో పనిచేయడం గురించి ఏఆర్ రెహమాన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
“హాన్స్ జిమ్మర్ తో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మా ఇద్దరి స్నేహం ఎంతో గొప్పది. మన దేశ సంస్కృతికి సంబంధించిన గొప్ప సినిమాకి మేమిద్దరం కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయన వల్ల ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతుంది. విదేశీయులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు. హాన్స్ జిమ్మర్ ‘రామాయణ’కు ఎందుకు సంగీతం అందించారనే ఆసక్తితో కూడా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు ‘రామాయణ’ను ఆదరిస్తారు. ఓ సినిమాకు ఆయన సంగీతం అందించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నా కెరీర్ లోనే పనిచేసిన అతిపెద్ద సినిమాలో ఒకటి ‘రామాయణ’”.
“సినిమా తీసే విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అత్యాధునిక సాంకేతికత వినియోగించడంతో సినిమా మరో స్థాయికి వెళుతుందని నమ్మకముంది. త్రీడీలో టైలర్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువంటి టెక్నాలజీతో ఒక భారతీయ సినిమా ఇంతవరకు రాలేదు. త్రీడి విజువల్స్, సంగీతం గురించి ఖచ్చితంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రేక్షకుల్ని రామాయణ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంద’ని అన్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణాసురుడిగా యశ్, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. దాదాపు 4వేల కోట్లతో సినిమా జరిగిక్కుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.
