హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది ఉద్యోగులు, స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా హాస్టల్స్ ను పోలీసులు ఖాళీ చేయించారు. చాలా మంది ముందుగానే ఇళ్లకు వెళ్లిపోయారు. కొంతమంది మాత్రం హాస్టల్స్ లోనే ఉండిపోయారు. అయితే, ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటున్న వారిని సైతం ఖాళీ చేయాలని యాజమాన్యం పట్టుబడ్డటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డుమీదకు వచ్చారు.
పోలీసులు కనికరించి వారికి ఎన్ఓసి ఇవ్వడంతో సొంత ఊళ్లకు పయనంఅయ్యారు. అయితే, తెలుగు రాష్ట్రాల బోర్డర్ కు చేరుకున్న వాళ్లకు ఏపీలోకి అనుమతి లభించలేదు. అర్ధరాత్రి తరువాత అక్కడ హైడ్రామా నడిచింది. దాదాపుగా వెయ్యిమంది జగ్గయ్యపేట వద్ద ఆగిపోయారు. దీంతో ఏపీ సీఎం జగన్ జోక్యం చేసుకొని వారిని ఏపీలోకి అనుమతించారు. కానీ, వాళ్ళను డైరెక్ట్ గా ఇళ్లకు పంపకుండా క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు.
అయితే, క్వారెంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు కేవలం 44 మంది మాత్రమే అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ 44 మందిని అక్కడి నుంచి రాజమండ్రి, భీమవరం తరలించారు. మిగతా వాళ్ళను తిరిగి హైదరాబాద్ పంపించేశారు. హాస్టల్స్ తెరిచే ఉంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో హైదరాబాద్ లో హాస్టల్స్ తిరిగి తెరుచుకున్నాయి. హాస్టల్స్ లో ఉన్న వ్యక్తులు అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
281108 667999I got what you mean , saved to bookmarks , really decent internet site. 849980
436255 74369excellent day, your internet website is inexpensive. I do many thanks for succeed 807406
949296 816766Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your blog and appear forward to new posts. 774967
255980 512419Some genuinely good stuff on this internet internet site , I it. 423553