ఏపీకి ఏడాదిలో పది లక్షల కోట్ల పెట్టుబడులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,301FansLike
57,764FollowersFollow

పారిశ్రామిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఏడాదిలోనే రూ. 9 లక్షల 34 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి తీసుకురావడం గమనార్హం. ఇది వైసీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడుల కంటే ఎక్కువ. ఈ పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 340కి పైగా కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 25 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక శక్తి, సెమీకండక్టర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, AI ఆధారిత విద్య, డిజిటల్ స్కిల్లింగ్ మరియు అధునాతన తయారీ రంగాల్లో ఈ పెట్టుబడులు కేంద్రీకృతమవుతున్నాయి.

ఇటీవల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు రాబోయే ఐదు సంవత్సరాల్లో దశలవారీగా రాష్ట్రానికి చేరతాయి. ఈ పర్యటనలో క్లీన్ మ్యానుఫాక్చరింగ్, క్లౌడ్ సర్వీసెస్, రీసెర్చ్ పార్ట్‌నర్‌షిప్స్ వంటి అంశాలపై టెక్ సంస్థలతో చర్చలు జరిపారు. ఇకపై ప్రభుత్వం జపాన్, అమెరికా, జర్మనీ దేశాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యటనలు చేయనుంది.

ఇప్పటికే వచ్చిన పెట్టుబడుల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించింది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో వస్తోంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

విశాఖలో సెమీకండక్టర్ చిప్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌తో చర్చలు జరుగుతున్నాయి. అలాగే, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చింది. మైక్రోసాఫ్ట్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం 2 లక్షల మంది యువతకు AI మరియు ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నారు. IVP సెమీ, DTDS గ్రూప్‌లతో కూడా సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయి.

యూట్యూబ్ అకాడమీ ఇండియా, టెసెరాక్ట్ ఇంక్ సహకారంతో యువతకు కంటెంట్ క్రియేషన్, బ్రాండింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ 20 ల్యాబ్స్‌ను పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 8 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. అమరావతిలో AI యూనివర్సిటీతో కలిసి NVIDIA కూడా పనిచేయనుంది.

ఇక విశాఖలో TCS రూ. 1370 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభించి 12 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. కాగ్నిజెంట్ రూ. 1582 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలను కల్పించనుంది. సత్యసాయి జిల్లాలో ఇండోసోల్ సోలార్ రూ. 58,469 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అనకాపల్లిలో లారస్ ల్యాబ్స్ రూ. 5630 కోట్ల పెట్టుబడితో 6350 ఉద్యోగాలు కల్పించనుంది. లులు మాల్ రూ. 1500 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి ఉపాధి ఇవ్వనుంది.

ఈ పెట్టుబడులన్నీ ఏపీని దేశంలోనే అగ్ర పారిశ్రామిక రాష్ట్రంగా నిలిపే దిశగా పునాది వేస్తున్నాయి.

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

అడవిలో 10 కిలోమీటర్లు నడిచే పిల్లలకు రోడ్డు: అసలు విషయం ఇది!

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం...

Daily Horoscope: ఉద్యోగ అవకాశాలు – సింహానికి శుభవార్త, ధనుస్సుకు ఆర్థిక లాభ సూచనలు

ఫిబ్రవరి 28, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు మీపై వస్తాయి. సహచరుల సహకారం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో శాంతంగా ఉండాలి. ఖర్చుల...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్ చూసి ఫిదా కానివారు లేరు. క్లిష్టమైన...

శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో...