ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పటికే 150 కి పైగా సీట్లలో భారీ ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సిపి 13 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన మంత్రులందరూ వెనకంజలో ఉన్నారు.
నగరిలో మంత్రి రోజా తొలి రౌండు నుంచి వెనకబడ్డారు. అక్కడ కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నాయుడు ప్రస్తుతం ఎనిమిది వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో మాజీమంత్రి కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. అక్కడి కూటమి అభ్యర్థి, టిడిపి నేత వెనిగండ్ల రాము ఐదువేల పైచిలుకువాట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కి సైతం షాక్ తగిలింది. అక్కడి కూటమి అభ్యర్థి కోన రవికుమార్ 9000 కు పైగా ఓట్ల ఆధిక్యం తో ముందంజలో ఉన్నారు.
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి 900 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి టిడిపి నేత కళా వెంకట్రావు ఆదిక్యం లో ఉన్నారు.
మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా డోన్ నియోజకవర్గంలో వెనుకంజ లో ఉన్నారు. తన సమీప అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి 1900 ఓట్ల తో ముందంజలో ఉన్నారు.
గాజువాకలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు. తన సమీప అభ్యర్థి, టీడీపి నేత పల్లా శ్రీనివాసరావు 21 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
మంత్రి విడదల రజిని కూడా వెనకబడ్డారు. అక్కడి కూటమి అభ్యర్థి గల్లా మాధవి 7 వేలకి పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు.
కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తన సమీప అభ్యర్థి, టిడిపి నేత బాల వీరాంజనేయులు కంటే మూడు వేల పైచిలుకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.