ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం వివిధ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు.
ఏపీ హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ ఉన్నారు. వీరి బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు హైకోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ బదిలీ ప్రతిపాదన వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కు తీసుకున్నారని అన్నారు. గుజరాత్ లో న్యాయవాదుల ఆందోళనతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టే ఇక్కడా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ నిర్ణయానికి ఏపీ బార్ కౌన్సిల్ తోపాటు లిటికెటెంట్ లు కూడా మద్దతు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. కొలీజియం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ నేటి నుంచి విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు.
286092 646112This web site is my inspiration , really outstanding layout and perfect topic matter. 240234